కరోనావైరస్: భారత్‌లో 21 వేలు దాటిన మొత్తం కేసులు; ఏపీలో 893, తెలంగాణలో 980 మందికి పాజిటివ్

భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దాంతో, దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,393కి చేరిందని చెప్పారు.

లైవ్ కవరేజీ

బీబీసీ తెలుగు కరోనావైరస్ LIVE అప్‌డేట్స్ పేజీకి స్వాగతం

ఇప్పటివరకూ ఉన్న ముఖ్యాంశాలు

  • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కరోనావైరస్ బారినపడ్డవారి సంఖ్య 26 లక్షలు దాటింది.
  • అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు అనుమతించే గ్రీన్ కార్డుల జారీని 60 రోజుల పాటు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులను పొడిగించే అవకాశం కూడా ఉందని తెలిపారు.
  • భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 21 వేలు దాటింది. ఇప్పటి వరకూ 681 మంది చనిపోయారు.
  • కరోనావైరస్ మరణాలను అధికారికంగా ప్రకటించడాన్ని చైనా నిలిపివేసింది. గత వారం రోజుల అధికారిక గణాంకాలను పరిశీలిస్తే చైనాలో ఈ వైరస్ బారిన పడినవారు ఒక్కరూ చనిపోలేదు.
  • ఫేస్ మాస్కులను ఉపయోగించడాన్ని జర్మనీ తప్పనిసరి చేసింది.