తారకరత్న: బెంగళూరు ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స, విషమంగానే ఆరోగ్యం

వివిధ విభాగాలకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.తారకరత్నకు అందుతున్న చికిత్సపై డాక్టర్ల తో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు అనంతరం తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, తండ్రి మోహన కృష్ణలతో కూడా మాట్లాడారు

లైవ్ కవరేజీ

  1. నందమూరి తారకరత్న: మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలింపు, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    నందమూరి తారకరత్న

    ఫొటో సోర్స్, Facebook/Nandamuri Tarakarathna

    నారా లోకేశ్ పాదయాత్రలో తీవ్రంగా అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు.

    శనివారం తెల్లవారుజామున కుప్పం నుంచి ఆంబులెన్స్‌లో బెంగళూరుకు తీసుకెళ్లారు.

    తొలుత ఐసీయూ నుంచి బయటకి తీసుకురావడం శ్రేయస్కరం కాదని బెంగళూరు డాక్టర్లు చెప్పినప్పటికీ చివరకు మెరుగైన చికిత్స కోసం తరలించినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి

    తారకరత్న భార్య అలేఖ్య రెడ్డితో చర్చించిన తర్వాత బెంగళూరు తరలించాలని నిర్ణయించారు.

    ప్రస్తుతం బెంగళూరులో వైద్యం అందిస్తున్నారు.

    కూతురు నిషికతో కలిసి తొలుత కుప్పం ఆసుపత్రికి చేరుకున్న అలేఖ్య, అక్కడి నుంచి అంబులెన్స్ వెంట బెంగళూరు వెళ్ళారు.

  2. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూనే ఉండండి.

  3. ఆమె గుండె ఆరు గంటలు కొట్టుకోవడం మానేసింది, అయినా ఆమె ప్రాణం పోలేదు..ఏం జరిగింది?