ఆంధ్రప్రదేశ్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం
ఉదయం వరకూ కొత్తగా 12 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం
తాజా బులిటెన్లో తెలిపింది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 161కి
పెరిగింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు...
కాకినాడలో కరోనాని జయించిన యువకుడు
లండన్ నుంచి వచ్చిన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన యువకుడు రెండు వారాల క్రిందట కరోనావైరస్ పొజిటివ్ నిర్ధారణ కావటంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు.
ఆయనకు తాజాగా కరోనావైరస్ నెగిటివ్ రావడంతో హాస్పత్రి నుండి డిచార్జ్ అయ్యారు.
కరోనావైరస్ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ముందుగా వచ్చి చికిత్స చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదని ఆ యువకుడు పేర్కొన్నారు.
‘‘నేను అలాగే వైద్యం చేయించుకున్నాను. హాస్పిటల్ లో నాకు మంచి ట్రీట్మెంట్ అందింది. వైరస్ సోకిన వారు సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రిలో చేరితే చిన్న చిన్న లక్షణాలతో బయటపడొచ్చు’’ అని చెప్పారు.
సోషల్ మీడియాలో వదంతులను నమ్మవద్దని సూచించారు.