You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ: సూర్యకుమార్కు దక్కని చోటు, కెప్టెన్గా శ్రేయస్
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్ 2026 కోసం శనివారం బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఈ యువ ఆటగాడికి తొలిసారిగా చోటు దక్కింది.
సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియా సమావేశంలో ఈ జట్లను ప్రకటించారు. ఈ ఎంపికలో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల భారత్కు టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను జట్టు నుంచి తప్పించగా, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అలాగే, తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించారు. మరోవైపు హార్దిక్ పాండ్యాకూ జట్టులో చోటు దక్కలేదు.
ఏషియన్ గేమ్స్ కోసం భారత జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ.
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం భారత జట్టు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
కాక్రోచ్ జనతా పార్టీ: అభిజిత్ దీప్కే, మోదీ ప్రభుత్వం గురించి ఏమన్నారు?
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, దిల్లీలోని జంతర్ మంతర్లో జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు.
ఆయన అమెరికా నుంచి శనివారం ఉదయం దిల్లీ చేరుకున్నారు.
‘సోషల్ మీడియాలో ఓ పేజీ నడపడం వల్ల ఏం వస్తుందని గత ఐదారు రోజులుగా చాలామంది నన్ను అడిగారు.
అలా అడిగిన వారికి ఈ కెమెరా తిప్పి చూపించండి. ఎంతమంది కాక్రోచ్లు ఈరోజు తమ ఇళ్ల నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొనడానికి వచ్చారో వారికి చూపించండి.
గత 10-12 ఏళ్లుగా వీళ్లంతా మనల్ని హిందూ-ముస్లిం రాజకీయాలకే పరిమితం చేశారు. ఆ రాజకీయాల వల్ల ఎవరికి ఏం ప్రయోజనం జరిగింది? హిందూ-ముస్లిం రాజకీయాలతో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా?’ అని వేదికపై నుంచి అభిజిత్ దీప్కే అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేస్తోంది. ఈ ఆందోళన ప్రదర్శనలను ప్రేమపూర్వకంగా, శాంతియుతంగా చేపట్టాలంటూ మద్దతుదారులకు సీజేపీ పిలుపునిచ్చింది.
జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న అభిజిత్ దీప్కే
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసనలో వేల మంది పాల్గొన్నట్లు కాక్రోచ్ ఈజ్ బ్యాక్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.
వేదిక వద్దకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చేరుకొని నిరసనల్లో పాల్గొన్నారు. వేదికపై నుంచి నినాదాలు చేశారు.
అక్కడ గుమిగూడిన నిరసనకారులంతా ‘ధర్మేంద్ర ప్రదాన్ గద్దె చోడ్’ అంటూ నినాదాలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తోంది.
బీజేపీ మద్దతుదారుల నిరసనలు
అయితే, కాక్రోచ్ పార్టీ నిరసనలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ పరిసరాల్లోని బారికేడ్ల బయట బీజేపీ మద్దతుదారులు నిరసనలు మొదలుపెట్టినట్లు, వారిని పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా పంపించినట్లు బీబీసీ ప్రతినిధి పవన్కాంత్ తెలిపారు.
సీఆర్పీఎస్ పోలీసులు బీబీసీకి వెల్లడించిన వివరాల ప్రకారం, జంతర్ మంతర్లో మొత్తం 700 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు.
ఇండియా మామిడి పళ్లను జపాన్ ఎందుకు నిషేధించింది?
అమ్నియోసెంటెసిస్: 35 ఏళ్ల తరువాత గర్భం దాల్చిన మహిళలు ఈ ప్రత్యేక పరీక్ష చేయించుకోవాలా?
సీజేపీ ధర్నా: దాదాపు 150 మంది ఫోటోగ్రాఫర్లను మోహరించిన దిల్లీ పోలీసులు
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ప్రదర్శనకు వేదికైన జంతర్ మంతర్ వద్ద దిల్లీ పోలీసులు దాదాపు 150 మంది ఫోటోగ్రాఫర్లను ఏర్పాటు చేసినట్లు బీబీసీకి తెలిసింది.
ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ప్రతీ ఒక్కరి ఫోటో తీసి, వారి ప్రొఫైల్ సిద్ధం చేయడం కోసమే ఈ ఫోటోగ్రాఫర్లను నియమించారని జంతర్ మంతర్ వద్ద రిపోర్ట్ చేస్తోన్న బీబీసీ ప్రతినిధి పవన్కాంత్ దిగవల్లి చెప్పారు.
‘రాళ్లు రువ్వడం వంటి ఉద్రిక్తతలకు లేదా ఇతర గొడవవకు కారణమయ్యే వ్యక్తులను గమనించడం, వారిని ఫోటోలు తీయడమే మాకు అప్పగించిన పని’ అని బీబీసీతో మాట్లాడుతూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక ఫోటోగ్రాఫర్ చెప్పారు.
విమానం దిగగానే అభిజిత్ ఎలా కనిపించారు, ఏం చెప్పారు?
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే, దిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న వీడియోను వార్తా సంస్థ పీటీఐ ట్వీట్ చేసింది.
‘విద్యా శాఖ మంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలి. అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు’ అని అభిజిత్ వ్యాఖ్యానించడం ఆ వీడియోలో చూడొచ్చు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముఖచిత్రం ఉన్న పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు.
ఏఐ సాయంతో వ్యాక్సిన్ తయారీ, ఇకపై వైరస్ ‘వేషాల’కు చెక్ పెట్టొచ్చా?
నిరసనకు దిల్లీ పోలీసుల అనుమతి దొరికిందని సీజేపీ ప్రకటన
జంతర్ మంతర్ వద్ద తాము నిర్వహించబోయే నిరసన ప్రదర్శనకు దిల్లీ పోలీసుల నుంచి అనుమతి లభించిందని కాక్రోచ్ ఈజ్ బ్యాక్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.
ఈ నేపథ్యంలో ముందు ప్రణాళిక ప్రకారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా మద్దతుదారులంతా జంతర్ మంతర్ వద్దకే రావాలని కోరింది.
అలాగే, 10 గంటల నుంచి శాంతియుత నిరసన మొదలుపెడదామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా ట్వీట్ చేశారు.
ఉదయం 9 గంటల సమయంలో జంతర్ మంతర్ వద్ద వాతావరణం ఎలా ఉందో కింది ఫోటోల్లో చూడండి.
సీజేపీ ధర్నా: ‘పూలు, పుస్తకాలు, జాతీయజెండా తీసుకురండి’’ అంటూ పిలుపు
జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయాలని మద్దతుదారులకు సీజేపీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
తమతో పాటు తిరంగా జెండా, పూలు, పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఎలాంటి హింసకు తావులేకుండా కేవలం శాంతిపూర్వకంగానే నిరసన చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను సాధించుదామని ఎక్స్ వేదికగా ఒక వీడియోలో పేర్కొన్నారు.
మద్దతుదారులు తమతో పాటు తమ తల్లిదండ్రులను కూడా తీసుకురావాలని కోరారు.
ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే వెంటనే దిల్లీ పోలీస్కు రిపోర్ట్ చేయాలని, తమ ఫోన్లను ఆన్లో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవే విషయాలను ప్రస్తావిస్తూ ధ్రువ్ రాఠీ కూడా ఎక్స్లో ఒక వీడియో పెట్టారు.
సోషల్ మీడియాలో పుట్టి నేడు తొలిసారి వీధుల్లోకి రానున్న కాక్రోచ్ జనతా పార్టీ
దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరనస తెలిపేందుకు అమెరికా నుంచి భారత్కు చేరుకున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు సీజేపీ యోచిస్తోంది.
ఈ మేరకు జూన్ 5న ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ ఎక్స్ హ్యాండిల్ ఒక పోస్ట్ చేసింది. అందులో తమ ప్రణాళికను పంచుకుంది.
‘‘ఫెలో కాక్రోచెస్.. జూన్ 6న ఉదయం 9 గంటలకు కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా నిరసన చేద్దాం. చిన్న తమాషాను ఉద్యమంగా మార్చే సమయం ఇదే. శాంతియుతంగా నిరసన తెలపడానికి దిల్లీ వీధుల్లోకి వచ్చేయండి. కానీ, అక్కడ ఏం చేయాలో? ఏం చేయకూడదో కూడా గుర్తుపెట్టుకోండి. అందరి కళ్లు మనమీదే’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
రాజేష్ ఎక్స్పోర్ట్స్: 15 లక్షల కోట్ల ‘నకిలీ ఆదాయం’ చూపిందని సెబీ ఆరోపిస్తున్న కంపెనీలో ఎల్ఐసీ భారీ పెట్టుబడులు ఎందుకు పెట్టింది?
బైక్పై వెళ్తుంటే ఏనుగు అడ్డొచ్చి వెంబడించింది.. ఎలా తప్పించుకున్నారంటే
'4 అడుగుల ఇంట్లో 4 తరాలుగా ఉంటున్నాం'
సహారా ఎడారి మధ్యలో చెడిపోయిన లారీ.. నీళ్లు దొరక్క దాహంతో 49 మంది మృతి
తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఉద్యోగాలకు ఎక్కువ అర్హత ఉన్నవారు ఎంపికైతే.. బ్యాంక్ అటెండెంట్ కేసులో సుప్రీంకోర్ట్ ఏం చెప్పింది?
‘తెలివైన ఎలుగుబంటి.. ట్యాప్ విప్పి నీరు తాగింది, కిటికీ తీసి పారిపోయింది’
అన్నామలై: ‘రజినీకాంత్ పిలిచినా వెళ్లలేదు.. అవసరమైతే బీజేపీతోనూ విభేదిస్తా’