విశాఖపట్నం: అనకాపల్లిలో కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పిల్లర్లు

ప్రచురణ

విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.

డైట్ కాలేజీ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి పిల్లర్లు కూలి వాహనాలపై పడిపోయాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.

బ్రిడ్జి కింది నుంచి వెళుతున్న ఓ కారు, ఆయిల్ ట్యాంకర్ ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి.

బ్రిడ్జి బీమ్ మీద పడటంతో ఆయిల్ ట్యాంకర్ నుజ్జునుజ్జు అయింది.

అయితే, అది ఖాళీ ట్యాంకర్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదం సమయంలో బ్రిడ్జి కింది నుంచి వెళ్తున్న కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు.

తమతో కారులో వచ్చిన ఇద్దరు చనిపోయారని ప్రాణాలతో బయటపడిన వాళ్లు చెప్పారు.

హైవే విస్తరణలో భాగంగా అనకాపల్లి బైపాస్ దగ్గర బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

పిల్లర్లు కూలుతున్న సమయంలో పెద్ద శబ్దాలు రావడంతో అక్కడున్న ప్రజలు పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో మరో రెండు కార్లు కూడా ధ్వంసం అయ్యాయి.

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)