You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రేవంత్ రెడ్డి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం - Newsreel
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.
కార్యనిర్వాహక అధ్యక్షులుగా గీతా రెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, టి జగ్గారెడ్డి, బి మహేశ్ కుమార్ గౌడ్లను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీచేసింది.
విద్యార్థిగా ఉన్నపుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగంలో పనిచేసిన రేవంత్.. అనంతరం టీడీపీలో చేరారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత ఎంఎల్సీ ఎన్నికల్లోనూ పార్టీని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.
కొడంగల్ నియోజవర్గం నుంచి వరుసగా రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ ఎన్నికయ్యారు. 2015 ఎంఎల్సీ ఎన్నికల్లో లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై అరెస్టై బెయిల్ మీద విడుదలయ్యారు.
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గాను, టీటీడీపీ శాసనసభా పక్ష నేతగాను ఉన్న ఆయన.. 2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ ముగ్గురు అధ్యక్షుల్లో ఒకరుగా నియమితులయ్యారు.
కత్తి మహేశ్కు రోడ్డు ప్రమాదం... తల, ఎడమ కంటికి తీవ్రగాయాలు
సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం, చంద్రశేఖరపురం సమీపంలో హైవే మీద ఈ ప్రమాదం జరిగింది.
మహేశ్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వెళ్తున్న లారీని వేగంగా డీకొట్టింది. దాంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిపోయింది. తలకు, కంటికి తీవ్రగాయాలైన మహేశ్ను వెంటనే నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు.
ఆయన ఎడమ కంటికి బాగా దెబ్బ తగిలిందని, తలకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని వైద్యులు చెప్పారని ఆయన సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ముఖానికి శస్త్ర చికిత్సలు పూర్తయిన తరువాత కత్తి మహేశ్ను చెన్నై ఆస్పత్రికి తరలిస్తారని వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు.. పరువు కోసం చంపేస్తామంటున్న కుటుంబం
- హైవేపై లారీ డ్రైవర్ల నుంచి పొందే సాయంతో గోశాల నిర్వహిస్తున్న ట్రాన్స్జెండర్
- సంచయిత, అశోక్ గజపతి రాజు: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి విషయంలో ఇన్ని వివాదాలు ఎందుకు?
- గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ఎందుకు కుప్పకూలాయి.. కంపెనీ ఏం చెబుతోంది..
- ద గేట్స్ ఆఫ్ హెల్: ఎడారిలో అగ్ని బిలం.. దశాబ్దాలుగా మండుతూనే ఉంది
- బెంజమిన్ నెతన్యాహు: ఈ ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడు ప్రపంచానికి ఎలా గుర్తుండి పోతారు
- మిజోరాం: 38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్ద’ ఇకలేరు
- పాకిస్తాన్లో మహిళల లోదుస్తులు అమ్మడం ఎందుకంత కష్టం?
- ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ కొత్త ప్రధాని నాఫ్తాలి బెన్నెట్
- సుశాంత్ సింగ్ రాజ్పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- భారత్లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)