ఖతార్ - దహ్రా గ్లోబల్ కేసు: మరణ శిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారులకు శిక్ష తగ్గింపుపై కేంద్రం ఏం చెప్పింది?

ఈ ఎనిమిది మందిలో విశాఖపట్నానికి చెందిన పాకాల సుగుణాకర్ ఒకరు. కేసు అప్పీలుపై విచారణకు ఖతార్‌లో భారత రాయబారి, ఇతర అధికారులు హాజరయ్యారు.

లైవ్ కవరేజీ

  1. ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉంది?

    తమిళనాడులో విజయ్

    ఫొటో సోర్స్, Getty Images

    కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి సహా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలలోని అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

    ఇప్పటిదాకా పూర్తయిన లెక్కింపునుబట్టి చూస్తే పశ్చిమబెంగాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే సగానికి పైగా స్థానాలలో బీజేపీ ఆధిక్యంలో సాగుతుండగా, నాలుగోసారి అధికారంలోకి రావాలనుకున్న మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ చతికిలపడింది.

    ఇక తమిళనాడులోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాజకీయనాయకుడిగా మారిన సినీనటుడు విజయ్, తమిళనాడులో పాతుకుపోయిన పార్టీలను పక్కకు నెట్టి, విజయం వైపు దూసుకుపోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని విజయ్ టీవీకే పార్టీ సాధించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ లో ఆయన పార్టీ వందకు పైగా స్థానాలతో ముందంజలో ఉంది.

    కేరళలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతున్నట్టు ఇప్పటిదాకా పూర్తయిన లెక్కింపును బట్టి తెలుస్తోంది. దీంతో భారత్‌లో వామపక్షాలకు మిగిలిన ఏకైక రాష్ట్రం కూడా వారి చేతుల నుంచి జారిపోనుంది.

    అస్సాంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా సాగుతోంది.

    పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి స్వల్పమొగ్గు కనిపిస్తోంది. ఇక్కడి ఫలితాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

    మొత్తంగా ఫలితాలను చూస్తే రాజకీయ పరిస్థితులలో ఓ ముఖ్యమైన మార్పుకు అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ తన సంప్రదాయ బలమైన ప్రాంతాలను దాటి, ఆధిక్యంతో ముందుకు సాగుతుండగా, దక్షిణ భారత్‌లో కొత్త ప్రాంతీయ పార్టీలు పోటీల రూపాన్ని మార్చుతున్నాయి.

  2. విజయ్: తమిళనాట 62 స్థానాలలో గెలిచి 45 సీట్లలో ఆధిక్యంలో ఉన్న టీవీకే.. కేరళలో యూడీఎఫ్ విజయం - బెంగాల్, అస్సాంలో బీజేపీ ముందంజ

  3. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఫోకస్ అంతా ఆ సీట్లపైనే...

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

    ఫొటో సోర్స్, Getty Images/ANI/FileImage

    పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆసక్తికరంగా సాగుతోంది. తమిళనాడులో అనూహ్యంగా విజయ్ పార్టీ టీవీకే ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు దేశప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తోన్న బెంగాల్ ఫలితాల కౌంటింగ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనావేసిన విధంగానే బీజేపీ, టీఎంసీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది.

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా చర్చనీయాంశమైన నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీపూర్ ఒకటి. మమతను ఓడించేందుకు సువేందు అధికారిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బరిలోకి దించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్‌లో సుమారు రెండు వేల ఓట్ల తేడాతో ఆమెను ఓడించారు.

    అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. గత పదేళ్ల నుంచి అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ జలూక్‌బరి నుంచి బరిలోకి దిగారు. గత ఐదు ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో హిమంత బిశ్వ శర్మ గెలుపు జెండా ఎగరవేశారు. మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పైన, రెండుసార్లు బీజేపీ టికెట్‌పై గెలుపొందారు.

    తమిళనాడులో ఎక్కువగా చర్చనీయాంశమైన అసెంబ్లీ సీట్లలో కొళత్తూర్ నియోజకవర్గం ఒకటి. ఇక్కడి నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేశారు.2011, 2016, 2021లలో స్టాలిన్ ఈ నియోజకవర్గంలో గెలుపొందారు. కొళత్తూర్ నియోజకవర్గంలో రెండో రౌండ్ కౌంటింగ్‌లో ఎంకే స్టాలిన్‌ వెనుకపడ్డారు.

    అలాగే, రాజకీయాల్లోకి ప్రవేశిస్తూ విజయ్ పోటీ చేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుచ్చి, పెరంబూర్‌లు కూడా చర్చనీయాంశంగా మారాయి.

    కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు నాయకత్వం వహిస్తున్న పినరయి విజయన్ కన్నూర్ జిల్లాలోని ధర్మదామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. విజయన్ ఈ సీటును 2021, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. అలాగే, ప్రధాన ప్రతిపక్షమైన యూడీఎఫ్ నేత వి.డి.సతీశన్ ఎర్నాకుళం జిల్లా పరవూర్ సీటు నుంచి పోటీ చేశారు.

    కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అత్యంత హోరాహోరీగా పోటీ ఉన్న అసెంబ్లీ స్థానాలలో తట్టంచవాడి ఒకటి. ఈ స్థానం నుంచి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి పోటీ చేశారు. ఆయనకు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వి. వైతిలింగం నుంచి గట్టి పోటీ ఉంది.

  4. భవానీపుర్‌లో మమత ఆధిక్యమెంత?

    మమతా బెనర్జీ

    ఫొటో సోర్స్, Getty Images

    పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపుర్ నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి బీజేపీ నేత సువేందు అధికారిపై దాదాపు 2వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఎక్కువగా వార్తలలో నిలిచిన స్థానాలలో మమత పోటీ చేస్తున్న భవానీపుర్ కూడా ఉంది. ఈ నియోజకవర్గాన్ని మమతకు కంచుకోటగా పరిగణిస్తుంటారు.

    అయితే ఈసారి మమతకు గట్టిపోటీ ఇచ్చేందుకు విపక్షనేత సువేందు అధికారిని బీజేపీ బరిలోకి దింపింది. కిందటిసారి ఎన్నికలలో మమత నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అప్పుడు సువేందు అధికారి 2వేల ఓట్ల మెజారిటీతో మమతను ఓడించారు.

    కానీ ఈసారి మమతకు గట్టిపట్టున్న భవానీపుర్‌లోనే సువేందు ఆమెపై పోటీకి దిగారు. దీంతోపాటు సువేందు తనకు బాగా పట్టున్న నందిగ్రామ్‌ నుంచి కూడా పోటీలో ఉన్నారు.

  5. ఆధిక్యంలో సెంచరీ దాటిన విజయ్ పార్టీ

    విజయ్

    ఫొటో సోర్స్, File image

    ప్రస్తుతానికి తమిళనాడు సినీనటుడు విజయ్ పార్టీ టీవీకే 102 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, ఏఐడీఎంకే 70 స్థానాలలోనూ, డీఎంకే 62 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నాయి.

  6. అసెంబ్లీ ఎన్నికలు 2026 ట్రెండ్స్: ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఆధిక్యం ?

    అసెంబ్లీ  ఎన్నికలు

    తమిళనాడులో నటుడు విజయ్ పార్టీ టీవీకే ఆధిక్యంలో ఉంది. ఇక్కడ అధికార డీఎంకే 63, ఏఐడీఎంకే 67 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, టీవీకే 104 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఈ రాష్ట్రంలో మెజారిటీ సాధనకు కావాల్సినవి 118 స్థానాలు.

    ఇక దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న పశ్చిమబెంగాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. టీఎంసీ 124 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 149 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 4 స్థానాలు, వామపక్షాలు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్లో అధికారం దక్కాలంటే 148 స్థానాల్లో విజయం సాధించాలి.

    అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్య మెజార్టీ విషయంలో చాలా అంతరం కనిపిస్తోంది.ఇక్కడ బీజేపీ 96 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 27 స్థానాలలోనూ, ఏఐయూడీఎఫ్ 2 స్థానాలలోనూ, ఇతరులు 1 స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నారు.

    వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో ఈసారి ఆ పార్టీలు వెనకబడినట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి 48 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, యూడీఎఫ్ కూటమి 91, ఎన్డీయే 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

    కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 22 స్థానాలలో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 4 స్థానాలలో, ఇతరులు 4 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.

  7. తొలి రౌండ్‌లో వెనుకబడిన స్టాలిన్

    స్టాలిన్

    ఫొటో సోర్స్, FACEBOOK

    తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తొలిరౌండ్ ముగిసే సరికి 886 ఓట్లతో వెనుకపడ్డారు. ఆయన కొళత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు తొలి రౌండ్‌ ముగిసేసరికి 4130 ఓట్లు లభించాయి.

  8. 'బ్రిజ్ భూషణ్ ఇలాకాలో పోటీలా? ఆరుగురు బాధితుల్లో నేనూ ఒకరిని' : రెజ్లర్ వినేశ్ ఫొగాట్

  9. అక్రమ మద్యం దుకాణంపై దాడి చేసి, ధ్వంసం చేసిన మహిళలు

  10. 'తనతో పుట్టిన కవల సోదరి.. సవతి సోదరి అని తెలిసినప్పుడు..'

  11. వేసవిలో ఏసీలు పేలిపోవడానికి కారణాలేంటి, పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  12. ప్రేమ, అబద్ధాలు, దెయ్యాలు: భారతీయులు విపరీతంగా చూస్తోన్న ఈ 2 నిమిషాల 'మైక్రో డ్రామా'ల కథేంటి?

  13. చెన్నై: మెరీనా బీచ్‌కు ఆ పేరెలా వచ్చింది?

  14. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ఎలా మారుస్తాయి? - 7 కీలకాంశాలు

  15. ఎండాకాలంలో వండిన ఎంతసేపటికి ఆహారం పాడవుతుంది? ఫుడ్ పాయిజన్‌గా ఎప్పుడు మారుతుంది?

  16. ఏపీ: జీతాలు పెంచాలంటూ కార్మికుల సమ్మె, ఆంధ్ర పేపర్‌ మిల్లును మూసేసిన యాజమాన్యం

  17. అది పాత పెంకుటిల్లు కాదు.. పెంపుడు జంతువులకు ఆధునిక వైద్యశాల

  18. పశ్చిమ బెంగాల్: పోలింగ్ తర్వాత కూడా రాజకీయాలు ఎందుకు ఉద్రిక్తంగా ఉన్నాయి?

  19. పేలని అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు ఇరాన్‌కు వరంగా మారాయా?

  20. పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?