న్యూఢిల్లీలోని ప్రగతి
మైదాన్లో భారత్ మండపం వద్ద జరుగుతున్న జీ20 సదస్సుకు విదేశాల నుంచి వచ్చిన అధినేతలకు,
ప్రతినిధులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు.
విదేశీ
నేతలకు ప్రధాని మోదీ ఆహ్వానం పలికిన వేదిక వెనుకాల అతిపెద్ద కోణార్క్ చక్రాన్ని ఏర్పాటు
చేశారు.
కోణార్క్
చక్రం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు
వివరించారు.
కోణార్క్
చక్రం ప్రత్యేకతలేంటో మనం చూద్దాం..
కళింగా (నేటి
ఒడిశా)లోని కోణార్క్ సూర్య దేవాలయానికి చెందినది ఈ చక్రం. రాజు లాంగుల నరసింహాదేవ్
1 పాలనలో 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
1238
నుంచి 1264 మధ్య కాలంలో నరసింహాదేవ్ 1 పాలన సాగింది. తన పాలన సమయంలో ఒడిశాలోని సముద్ర
తీరంలో ఉన్న కోణార్క్లో సూర్య దేవాలయాన్ని కట్టారు.
హిందూ వాస్తుశిల్పానికి
ఈ ఆలయం ఒక చిహ్నంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో మూడు భాగాలుంటాయి.
ప్రధాన
ద్వారంతో, ప్రార్థనా స్థలంతో, నాట్య వేదికతో ఈ ఆలయం అనుసంధానమై ఉంటుంది.
ఆలయం, ప్రార్థనా
స్థలం రథం ఆకారంలో ఉంటాయి. 12-12 మొత్తం 24 చక్రాలుంటాయి. వీటినే చక్రా అని
పిలుస్తారు.
ఏడు
గుర్రాల చేత లాగుతున్నట్లుగా ఉన్న సూర్యుని రథాన్ని ఇది సూచిస్తుంది. యునెస్కో
ప్రపంచ వారసత్వ జాబితాలో కోణార్క్ సూర్యదేవుని ఆలయం చోటు దక్కించుకుంది.
19వ
శతాబ్దంలో బ్రిటిష్ పాలన నుంచి దీన్ని కాపాడేందుకు ఆలయంలోని ప్రధాన భాగంలో మొత్తం
రాళ్లు, ఇనుప కడ్డీలతో నింపారు.
ఆలయం
లోపలున్న ఈ రాళ్లు, ఇసుక, ఇనుమ కడ్డీలను తొలగించాలని భారత పురావస్తు శాఖ 2022లో
నిర్ణయించింది.
ఈ
చక్రం భారత పురాతన పరిజ్ఞానాన్ని,
నాగరికతను, వాస్తుశిల్పాన్ని ప్రదర్శిస్తోంది.
కోణార్క్ చక్రం
పురోగతిని, నిరంతర మార్పును సూచిస్తోంది. కోణార్క్ చక్ర రొటేషన్ను కాలచక్రతో పోలుస్తారు.