‘‘అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పది నుంచి ఐదుకు’’
‘‘2014లో మేం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ పదో స్థానంలో ఉండేది. నేడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారింది’’ అని మోదీ చెప్పారు.
‘‘మేం అధికారంలోకి వచ్చినప్పుడు అవినీతి రాజ్యమేలేది. మేం దాన్ని కూకటివేళ్లతో పెకలించాం. పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటుచేశాం’’ అని మోదీ చెప్పారు.
‘‘దేశంలోని యువత శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకముంది. వారికి శక్తి నిచ్చేందుకు, వారి సామర్థ్యాలను పెంచేందుకు మా విధానాలు కృషి చేస్తున్నాయి. ప్రపంచంలోని అంకుర సంస్థల స్థాపనలో భారత్ మూడో స్థానానికి వెళ్లడానికి ఇక్కడి యువతే కారణం’’ అని మోదీ చెప్పారు.