You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జూన్ 5కు వాయిదా

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు జూన్ 5కు వాయిదా వేసింది.

లైవ్ కవరేజీ

  1. ‘‘రోడ్డుపైకి వెళ్లి నిరసన తెలిపే బదులు రెజ్లర్లు మా వద్దకు రావాల్సింది’’: పీటీ ఉష

    రెజ్లర్లు రోడ్లపై నిరసన తెలిపే బదులు తమ దగ్గరికి వస్తే బాగుండని, ఇది ఆటకు ఏ మాత్రం మంచిది కాదని భారత ఒలంపిక్ అసోసియేషన్(ఐఓఏ) ప్రెసిడెంట్, రాజ్యసభ నామినేటెడ్ ఎంపీ పీటీ ఉష అన్నారు. కాస్త క్రమశిక్షణతో మెలగాల్సి ఉందన్నారు.

    రెజ్లర్లు ఇలా ధర్నా చేయడం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు.

    భారత ఒలంపిక్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీతో పీటీ ఉష సమావేశం నిర్వహించారు.

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను నిర్వహించేందుకు ముగ్గురు సభ్యులతో ఒక ప్యానల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

    ఈ ప్యానల్‌లో మాజీ షూటర్ సుమా షిరూర్, ఉషు అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ భూపేంద్ర సింగ్ బజ్వా, హైకోర్టు మాజీ జడ్జి సభ్యులు. అయితే జడ్జి ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.

    పీటీ ఉష ప్రకటనపై స్పందించిన రెజ్లర్ బజ్‌రంగ్ పూనియా, ‘ఆమె నుంచి ఇలాంటి తీవ్రమైన ప్రకటన వస్తుందని మేం అసలు ఊహించలేదు’ అని చెప్పారు.

    ‘ఆమె ఒక మహిళ. ఇది వినడం చాలా బాధాకరంగా ఉంది. మూడు నెలల పాటు మేం వేచిచూశాం. ఆమె వద్దకు మేం వెళ్లాం. కానీ, మాకు న్యాయం దొరకలేదు. అందుకే మేం ఇక్కడకు రావాల్సి వచ్చింది’’ అని తెలిపారు.

  2. లైంగిక వేధింపు ఘటనలపై భారత క్రికెటర్లు నోరు ఎందుకు విప్పడం లేదు: వినేశ్ ఫొగాట్

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కి వ్యతిరేకంగా తాము చేస్తోన్న నిరసనలపై భారత క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు మౌనంగా ఉండటంపై రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ప్రశ్నించారు.

    బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు గత కొంత కాలంగా నిరసనలు చేస్తున్నారు.

    ‘‘దేశమంతా క్రికెట్‌ను ఆరాధిస్తుంది. కానీ, ఏ ఒక్క క్రికెటర్ కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు. మీరు మాకు అనుకూలంగా మాట్లాడాలని మేం దీన్ని చేయడం లేదు. కనీసం మీరు ముందుకు వచ్చి, న్యాయం జరగాలని కోరాలి కదా. ఇది నన్నెంతో బాధిస్తుంది. క్రికెటర్ అయినా, బ్యాడ్మింటన్ క్రీడాకారులు అయినా, అథ్లెటిక్స్ లేదా బాక్సర్ అయినా ముందుకు వచ్చి మాట్లాడాలి కదా’’ అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌ పేపర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినేశ్ ఫొగాట్ అన్నారు.

    ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ మూవ్‌మెంట్‌ను ఉదాహరణగా తీసుకుంటూ, వినేశ్ ఫోగట్ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘మన దేశంలో గొప్ప అథ్లెట్స్ లేరని కాదు. అమెరికాలో ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ మూవ్‌మెంట్‌కి క్రికెటర్లందరూ మద్దతు పలికారు. మాకంతా విలువ లేదా?’’ అంటూ ప్రశ్నించారు.

    ‘‘మేం ఏదైనా గెలిస్తే, మీరు ముందుకు వచ్చి మాకు శుభాకాంక్షలు తెలియజేస్తారు.క్రికెటర్లు కూడా ట్వీట్స్ చేస్తారు. ఇప్పుడేమైంది? సిస్టమ్‌కి మీరు భయపడుతున్నారా? లేదా అక్కడ కూడా ఏదైనా జరుగుతోందేమో?’’ వినేశ్ ఫొగాట్ అన్నారు.