ఉత్తరాఖండ్: హల్ద్వానీ జైలులో 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్
హల్ద్వానీ జైలులో 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయింది.
ఒక మహిళా ఖైదీకి కూడా హెచ్ఐవీ పాజిటివ్ సోకినట్లు సుశీల తివారి హాస్పిటల్ ఏఆర్టీ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ పరంజిత్ సింగ్ తెలిపారు.
జైలులో హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీలు పెరుగుతుండటంతో, జైలు అడ్మినిస్ట్రేషన్పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఏఆర్టీ సెంటర్ను హెచ్ఐవీ రోగుల కోసం ఏర్పాటు చేసిందని డాక్టర్ సింగ్ చెప్పారు. ఇక్కడ పేషెంట్లకు చికిత్స అందిస్తుంటామని అన్నారు.
జైలులోని ఖైదీలను తమ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు.