తెలంగాణ 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకు కేసులో బండి సంజయ్‌కు బెయిల్

రేపు ఉదయం బెయిల్ ఆదేశాలు కరీంనగర్ జైలుకు చేరుతాయని అప్పుడు బండి సంజయ్ విడుదల అవుతారని లాయర్లు తెలిపారు.

లైవ్ కవరేజీ

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌

ఫొటో సోర్స్, ANI

సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది.

ఈ నేపథ్యంలో రైలు బయలుదేరు సమయ వేళలను రీషెడ్యూల్ చేశారు.

బుధవారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని ఉదయం 9.45 గంటలకు మార్చినట్లు వాల్తెర్ డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు.

గుర్తు తెలియని దుండగులు జరిపిన రాళ్ల దాడిలో సీ-8 కోచ్ విండో గ్లాస్ పగిలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు.

గత మూడు నెల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై ఇలాంటి రాళ్ల దాడి జరగడం ఇది మూడవ సారి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది