You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎంఎం కీరవాణి: పద్మశ్రీ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు
ఆస్కార్ అవార్డు విజేత అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బుధవారం దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
లైవ్ కవరేజీ
విమానం దిగగానే అభిజిత్ ఎలా కనిపించారు, ఏం చెప్పారు?
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే, దిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న వీడియోను వార్తా సంస్థ పీటీఐ ట్వీట్ చేసింది.
‘విద్యా శాఖ మంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలి. అయిదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు’ అని అభిజిత్ వ్యాఖ్యానించడం ఆ వీడియోలో చూడొచ్చు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముఖచిత్రం ఉన్న పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు.
ఏఐ సాయంతో వ్యాక్సిన్ తయారీ, ఇకపై వైరస్ ‘వేషాల’కు చెక్ పెట్టొచ్చా?
సీజేపీ ధర్నా: ‘పూలు, పుస్తకాలు, జాతీయజెండా తీసుకురండి’’ అంటూ పిలుపు
జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేయాలని మద్దతుదారులకు సీజేపీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.
తమతో పాటు తిరంగా జెండా, పూలు, పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఎలాంటి హింసకు తావులేకుండా కేవలం శాంతిపూర్వకంగానే నిరసన చేపట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను సాధించుదామని ఎక్స్ వేదికగా ఒక వీడియోలో పేర్కొన్నారు.
మద్దతుదారులు తమతో పాటు తమ తల్లిదండ్రులను కూడా తీసుకురావాలని కోరారు.
ఎక్కడైనా హింసాత్మక ఘటనలు జరిగితే వెంటనే దిల్లీ పోలీస్కు రిపోర్ట్ చేయాలని, తమ ఫోన్లను ఆన్లో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఇవే విషయాలను ప్రస్తావిస్తూ ధ్రువ్ రాఠీ కూడా ఎక్స్లో ఒక వీడియో పెట్టారు.
సోషల్ మీడియాలో పుట్టి నేడు తొలిసారి వీధుల్లోకి రానున్న కాక్రోచ్ జనతా పార్టీ
దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరనస తెలిపేందుకు అమెరికా నుంచి భారత్కు చేరుకున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన తెలిపేందుకు సీజేపీ యోచిస్తోంది.
ఈ మేరకు జూన్ 5న ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ ఎక్స్ హ్యాండిల్ ఒక పోస్ట్ చేసింది. అందులో తమ ప్రణాళికను పంచుకుంది.
‘‘ఫెలో కాక్రోచెస్.. జూన్ 6న ఉదయం 9 గంటలకు కలుద్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా నిరసన చేద్దాం. చిన్న తమాషాను ఉద్యమంగా మార్చే సమయం ఇదే. శాంతియుతంగా నిరసన తెలపడానికి దిల్లీ వీధుల్లోకి వచ్చేయండి. కానీ, అక్కడ ఏం చేయాలో? ఏం చేయకూడదో కూడా గుర్తుపెట్టుకోండి. అందరి కళ్లు మనమీదే’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
రాజేష్ ఎక్స్పోర్ట్స్: 15 లక్షల కోట్ల ‘నకిలీ ఆదాయం’ చూపిందని సెబీ ఆరోపిస్తున్న కంపెనీలో ఎల్ఐసీ భారీ పెట్టుబడులు ఎందుకు పెట్టింది?
అన్నామలై: ‘రజినీకాంత్ పిలిచినా వెళ్లలేదు.. అవసరమైతే బీజేపీతోనూ విభేదిస్తా’
రేంజ్ యాంగ్జైటీ: ‘చార్జింగ్ సరిపోతుందో లేదో’ - ఈ భయమే ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు అడ్డంకిగా ఉందా
నడుము వంగిపోయిన ఈ పెద్దాయనకు జైలుశిక్ష ఎందుకు పడింది?
నీట్ విద్యార్థిని ఆత్మహత్య : ‘‘అమ్మా నాన్నా నన్ను క్షమించండి.. మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు, అంతా అయిపోయింది’’
సార్థక్,వేదాంత్, నిసర్గ్ : ఈ ముగ్గురు టీనేజర్లు ‘ఓఎస్ఎం వివాదం’పై ఏం చేశారు?
‘భయంకరమైన ఆర్థిక సునామీ రానుంది, ఏడాదిలోగా మోదీ దిగిపోతారు’అంటూ రాజకీయ దుమారం రేపిన రాహుల్గాంధీ
కాక్రోచ్ జనతా పార్టీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
యూట్యూబర్ నందు: వీసా మోసాలకు పాల్పడ్డారంటూ కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు, అసలు ఆరోపణలు ఏంటి? నందు ఏమన్నారు?
మీ ఉద్యోగం ఆనందాన్నిస్తోందా? ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందా?
మ్యాన్హోల్స్లోకి దిగుతూ, బయటకు వస్తూ కెమెరాలకు చిక్కిన గుర్తు తెలియని వ్యక్తులు, ఆరా తీస్తున్న పోలీసులు...
కాన్వెంట్లో కలుసుకుని పెళ్లి చేసుకున్న యువ క్రైస్తవ నన్స్ కథ
'ఇది రాంచరణ్ వన్ మ్యాన్ షో, క్లైమాక్స్ని ఆయన ఒప్పుకోవడం విశేషమే'
దిల్లీ అగ్నిప్రమాదానికి బీఅండ్బీ పాలసీనే కారణమా, ఏమిటీ పాలసీ?
ఇరాన్తో చర్చలను క్లిష్టతరం చేసిన ట్రంప్, నెతన్యాహు ఫోన్ కాల్ కథేంటి?