You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఎంఎం కీరవాణి: పద్మశ్రీ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు

ఆస్కార్ అవార్డు విజేత అయిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి బుధవారం దిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

లైవ్ కవరేజీ

  1. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 176 సీట్లలో విజయం 32 స్థానాల్లో ఆధిక్యం

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ రాత్రి 9.30 గంటలకు ఎలక్షన్ కమిషన్ తన వెబ్‌సైట్‌లో వెల్లడించిన ఫలితాల ప్రకారం.. 176 సీట్లలో విజయం సాధించి మరో 32 చోట్ల ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 59 సీట్లలో విజయం సాధించి మరో 20 చోట్ల ఆధిక్యంలో ఉంది.

    కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిచింది. ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ 2 సీట్లు గెలిచింది. సీపీఎం ఒక సీటు గెలిచింది. ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ ఒక స్థానం గెలిచింది.

  2. విజయ్ కారు డ్రైవర్ కొడుకు: ఎవరీ శబరినాథన్, ఎంత మెజార్టీతో గెలిచారు?

  3. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

    తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

    స్టాలిన్ 2011 నుంచి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన తమిళనాడు నాలుగో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. 1996లో జయలలిత ఓటమి తర్వాత, పదవిలో ఉన్న ముఖ్యమంత్రి తన సీటును కోల్పోవడం ఇదే మొదటిసారి.

    తమిళనాడు రాజకీయ చరిత్రలో గతంలోనూ కొందరు ముఖ్యమంత్రులు ఇలాగే ఓడిపోయారు:

    • 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.ఎస్. కుమారస్వామి రాజా శ్రీవిల్లిపుత్తూరు సీటు నుంచి ఓడిపోయారు.
    • 1967లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం. భక్తవత్సలం శ్రీపెరంబుదూర్‌లో పరాజయం పాలయ్యారు.
    • 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే-తమిళ మానిలా కాంగ్రెస్ కూటమి విజయం సాధించినప్పుడు, అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే ముఖ్యమంత్రి జయలలిత బర్గూర్ స్థానంలో ఓటమి పాలయ్యారు.

    దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, అధికారంలో ఉండి తన నియోజకవర్గంలో ఓడిపోయిన నాలుగో ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలిచారు. డీఎంకే పార్టీలో ఈ విధంగా ఓడిపోయిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే.

  4. పోటీ చేసిన రెండు స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ ముందంజ

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకు గానూ టీవీకే పార్టీ సాయంత్రం 4.30 గంటలకు 8 స్థానాల్లో విజయం సాధించగా, మరో 101 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

    మరోవైపు, విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

    ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, పెరంబూర్‌లో 13 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి విజయ్ 31,766 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, తిరుచ్చి ఈస్ట్‌లో 12 రౌండ్లు ముగిసేసరికి 15,707 ఓట్ల మెజార్టీతో ఉన్నారు.

    ఇదే సమయంలో ఎంకే స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. అక్కడ టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 7,731 ఓట్లకు పైగా మెజార్టీతో కొనసాగుతున్నారు.

    ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భద్రతను పెంచారు. విజయ్ పార్టీ ముందంజలో ఉండటంపై నాని, నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు వెంకట్ ప్రభు వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు.

  5. అస్సాం : కాంగ్రెస్ అభ్యర్థి గొగోయ్ ఓటమి

    అస్సాం ప్రతిపక్ష ముఖచిత్రంగా పేరుగాంచిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఓటమి చెందినట్టు ఈసీఐ ప్రకటించింది.

    జోర్హాట్ నియోజకవర్గంలో గొగోయ్‌పై పోటీచేసిన బీజేపీ అభ్యర్థి హితేంద్ర నాథ్ గోస్వామి 69,439 ఓట్లు సాధించగా, గొగోయ్‌కు 46,257 ఓట్లు మాత్రమే వచ్చాయి.

  6. విజయ్: తమిళనాట 62 స్థానాలలో గెలిచి 45 సీట్లలో ఆధిక్యంలో ఉన్న టీవీకే.. కేరళలో యూడీఎఫ్ విజయం - బెంగాల్, అస్సాంలో బీజేపీ ముందంజ

  7. 'బ్రిజ్ భూషణ్ ఇలాకాలో పోటీలా? ఆరుగురు బాధితుల్లో నేనూ ఒకరిని' : రెజ్లర్ వినేశ్ ఫొగాట్

  8. అక్రమ మద్యం దుకాణంపై దాడి చేసి, ధ్వంసం చేసిన మహిళలు

  9. 'తనతో పుట్టిన కవల సోదరి.. సవతి సోదరి అని తెలిసినప్పుడు..'

  10. వేసవిలో ఏసీలు పేలిపోవడానికి కారణాలేంటి, పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  11. ప్రేమ, అబద్ధాలు, దెయ్యాలు: భారతీయులు విపరీతంగా చూస్తోన్న ఈ 2 నిమిషాల 'మైక్రో డ్రామా'ల కథేంటి?

  12. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ఎలా మారుస్తాయి? - 7 కీలకాంశాలు

  13. ఎండాకాలంలో వండిన ఎంతసేపటికి ఆహారం పాడవుతుంది? ఫుడ్ పాయిజన్‌గా ఎప్పుడు మారుతుంది?

  14. ఏపీ: జీతాలు పెంచాలంటూ కార్మికుల సమ్మె, ఆంధ్ర పేపర్‌ మిల్లును మూసేసిన యాజమాన్యం

  15. అది పాత పెంకుటిల్లు కాదు.. పెంపుడు జంతువులకు ఆధునిక వైద్యశాల

  16. పశ్చిమ బెంగాల్: పోలింగ్ తర్వాత కూడా రాజకీయాలు ఎందుకు ఉద్రిక్తంగా ఉన్నాయి?

  17. పేలని అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు ఇరాన్‌కు వరంగా మారాయా?

  18. పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?

  19. ఆ తెల్లని చిన్నచిన్న ప్యాకెట్లు మీ కొత్త వాటర్ బాటిళ్లు, బూట్లలో ఎందుకు కనిపిస్తాయి? ఎందుకు వేస్తారు?

  20. దాదాపు అందరి ఫోన్లలో ఒకేసారి 'అలర్ట్' మెసేజ్ ఎందుకొచ్చింది? అసలు విషయమేంటి?