దిల్లీ పేలుడు: యూఏపీఏ, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు
నవంబర్ 10న దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి కేసు నమోదైంది.
నార్త్ డీసీపీ రాజా బందియా కేసు నమోదుకు సంబంధించిన సమాచారం వెల్లడించారు.
"ఎఫ్ఐఆర్ నమోదైంది. యూఏపీఏ, ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్, బీఎన్ఎస్ సంబంధిత విభాగాల కింద కేసు నమోదైంది" అని ఆయన అన్నారు . దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైన ఆధారాలను సేకరిస్తున్నామన్నారు.