దిల్లీ లిక్కర్ ‘స్కాం’: ఈడీ కార్యాలయంలో ముగిసిన కవిత విచారణ

మార్చి 11న తొలిసారి కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆ తరువాత 16న హాజరు కావాల్సి ఉండగా కవిత విచారణకు వెళ్లలేదు. అందుకు బదులుగా తన ప్రతినిధులను పంపారు.

లైవ్ కవరేజీ

  1. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో అధికార, విపక్ష ఎమ్మెల్యేల కొట్లాట, టీడీపీ సభ్యుల సస్పెన్షన్

    ఏపీ అసెంబ్లీ

    ఫొటో సోర్స్, aplegislature.org

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం పాలక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య కొట్లాట జరిగింది.

    అధికార, విపక్ష నేతల మధ్య వివాదం ముదిరి, ప్రత్యక్షంగా తలపడే వరకూ వెళ్లింది. జీవో 1ని రద్దు చేయాలని టీడీపీ పట్టుపట్టడంతో వివాదం తీవ్రస్థాయికి చేరింది. ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా ఈ ఘటన జరిగింది.

    స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు జీవో కాపీలు చించి, స్పీకర్‌పై విసిరారు. ఆ సమయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    ప్రభుత్వ చీఫ్‌ విప్ ముదునూరి ప్రసాదరాజు జోక్యం చేసుకుని టీడీపీ ఎమ్మెల్యేలను సస్ఫెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. ఆసమయంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయులు, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు మధ్య వాగ్వాదం శృతిమించి కొట్లాట వరకూ వెళ్లింది. దాంతో ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారు. స్పీకర్ సభను వాయిదా వేశారు.

    వాయిదా తర్వాత సభ ప్రారంభం కాగానే విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

  2. లండన్‌: భారత హైకమిషన్‌లో త్రివర్ణ పతాకాన్ని తొలగించేందుకు యత్నించిన అనుమానితుడి అరెస్ట్

  3. ‘గోల్డీ భాయ్‌తో మాట్లాడాలంటూ’ సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఈమెయిల్

    సల్మాన్ ఖాన్

    ఫొటో సోర్స్, ANI

    బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ కార్యాలయానికి బెదిరింపు ఈమెయిల్ పంపిన కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లతో పాటు మరొకరిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    ‘‘గోల్డీ భాయ్, సల్మాన్‌ఖాన్‌తో ముఖాముఖిగా కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నారు’’ అని ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లతో పాటు రోహిత్ అనే వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయినట్లు పోలీసు అధికారులను ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది.

    పంజాబ్‌లోని భటిండా జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లు పంజాబీ గాయకుడు సిద్ధూ ముసేవాలా హత్య కేసులో నిందితులుగా ఉన్నారు.

    బెదిరింపు ఈమెయిల్ గురించి ప్రశాంత్ గుంజాల్కర్, బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ‘‘శనివారం మధ్యాహ్నం గుంజాల్కర్, బాంద్రాలోని సల్మాన్‌ఖాన్‌ కార్యాలయంలో ఉండగా రోహిత్ గార్గ్ అనే ఐడీ నుంచి ఒక మెయిల్ వచ్చింది.

    హిందీలో వచ్చిన ఆ మెయిల్‌లో ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ ఇచ్చిన ఇంటర్వ్యూను సల్మాన్ ఖాన్ కచ్చితంగా చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఆయన కచ్చితంగా ఆ ఇంటర్వ్యూను చూడాలి. ఈ విషయాన్ని ఇక్కడితోనే ముగించాలని సల్మాన్ ఖాన్ అనుకుంటే గోల్డీ భాయ్‌తో నేరుగా కూర్చోని మాట్లాడాలి. ఇప్పటికీ ఇంకా మీకు సమయం ఉంది. మరోసారి మీకో షాక్ తగులుతుంది’’ అని ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న అంశాలను ఒక పోలీస్ అధికారి వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది.

    2022 జూన్‌లో కూడా సల్మాన్ ఖాన్‌ను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు.

  4. లండన్: భారత హైకమిషన్‌లోని త్రివర్ణ పతాకాన్ని తొలిగించేందుకు ఖలిస్తాన్ మద్దతుదారుల యత్నం

    జాతీయ పతాకం

    ఫొటో సోర్స్, Getty Images

    లండన్‌ భారత హైకమిషన్ కార్యాలయంలోని భారత జాతీయ పతాకాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు, వేర్పాటువాదులు తొలిగించేందుకు ప్రయత్నించినట్లు చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    ఈ ఘటనపై భారత ప్రభుత్వం స్పందించింది.

    దిల్లీలోని బ్రిటిష్ సీనియర్ దౌత్యవేత్తకు ఈ మేరకు నోటీసులు పంపించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయానికి భద్రత లేకపోవడం గురించి ప్రశ్నిస్తూ ఆదివారం రాత్రి బ్రిటిష్ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు పంపించినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    భారత ఎంబసీ ప్రాంగణం, అక్కడ పనిచేస్తున్న వారి భద్రత పట్ల బ్రిటన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, ఇది ఆమోదయోగ్యం కాదని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులను గుర్తించి వారిని అరెస్టు చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది.

    భారత హైకమిషన్ ప్రాంగణంలో జరిగిన ఘటనను దిల్లీలోని బ్రిటన్ హైకమిషనర్ అలెక్స్ ఎలిక్స్ ఖండిస్తూ ఒక ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2