పాదయాత్రలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పరిశీలించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా ఎల్లంపేట స్టేజితండాలో ‘అసంపూర్తిగా ఉన్న’ డబుల్ బెడ్రూమ్ ఇళ్లన పరిశీలించారు.
స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణాలలో నాణ్యత లోపించిందని స్థానికులు రేవంత్తో చెప్పారు.
కాగా గడువులోగా డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేయని కాంట్రాక్టర్ పై కేసు పెట్టాలని స్థానికులకు రేవంత్ రెడ్డి సూచించారు. ఈ అంశంపై తాను కూడా ప్రభుత్వానికి లేఖ రాస్తానని రేవంత్ చెప్పార.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సొంత ఇల్లు కట్టుకునే లబ్దిదారుడికి రూ.5 లక్షలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.