కాక్రోచ్ జనతా పార్టీ: అభిజిత్ దీప్కే, మోదీ ప్రభుత్వం గురించి ఏమన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, దిల్లీలోని జంతర్ మంతర్లో జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు.
ఆయన అమెరికా నుంచి శనివారం ఉదయం దిల్లీ చేరుకున్నారు.
‘సోషల్ మీడియాలో ఓ పేజీ నడపడం వల్ల ఏం వస్తుందని గత ఐదారు రోజులుగా చాలామంది నన్ను అడిగారు.
అలా అడిగిన వారికి ఈ కెమెరా తిప్పి చూపించండి. ఎంతమంది కాక్రోచ్లు ఈరోజు తమ ఇళ్ల నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో పాల్గొనడానికి వచ్చారో వారికి చూపించండి.
గత 10-12 ఏళ్లుగా వీళ్లంతా మనల్ని హిందూ-ముస్లిం రాజకీయాలకే పరిమితం చేశారు. ఆ రాజకీయాల వల్ల ఎవరికి ఏం ప్రయోజనం జరిగింది? హిందూ-ముస్లిం రాజకీయాలతో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా?’ అని వేదికపై నుంచి అభిజిత్ దీప్కే అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్ చేస్తోంది. ఈ ఆందోళన ప్రదర్శనలను ప్రేమపూర్వకంగా, శాంతియుతంగా చేపట్టాలంటూ మద్దతుదారులకు సీజేపీ పిలుపునిచ్చింది.

ఫొటో సోర్స్, Reuters





