You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

న్యూ ఇయర్ 2023: వెలుగు జిలుగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం... ప్రపంచవ్యాప్తంగా వేడుకలు

భూగోళం మీద మొట్టమొదటిగా పసిఫిక్ దీవి దేశమైన కిరిబాటికి 2023 కొత్త సంవత్సరం వచ్చింది. ఆ తర్వాత గంట సేపటికి న్యూజీలాండ్‌లోకి కొత్త ఏడాది ప్రవేశించింది. ఈ సందర్భంగా న్యూజీలాండ్‌లోని ఆక్‌లాండ్‌ నగరంలోని స్కై టవర్ మీది నుంచి బాణసంచా పేల్చారు. వివిధ దేశాల్లో న్యూఇయర్ సందడి ఎలా ఉందో చూడండి.

లైవ్ కవరేజీ

  1. రిషబ్ పంత్‌ను అవసరమైతే విమానంలో దిల్లీ తరలిస్తాం: దిల్లీ క్రికెట్ అసోసియేషన్

    రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి డెహ్రాడూన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రికెటర్ రిషభ్ పంత్‌ను అవసరమైతే విమానంలో దిల్లీకి తరలిస్తామని దిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) డైరెక్టర్ శ్యామ్ శర్మ అన్నారు.

    రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు దిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) బృందం డెహ్రడూన్‌ వెళ్తుందని శ్యామ్ శర్మ తెలిపారు.

    అవసరమైతే రిషభ్ పంత్‌ను దిల్లీకి తరలిస్తామని, ప్లాస్లిక్ సర్జరీ కోసం విమానంలో దిల్లీకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని శర్మ అన్నారు.

    చికిత్స పొందుతున్న రిషభ్ పంత్‌ను చూసేందుకు నటులు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్‌లు మ్యాక్స్ ఆసుపత్రికి వచ్చారు. ‘‘రిషభ్ పంత్‌ను, అతని తల్లిని కలిశాం. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని మనందరం ప్రార్థన చేద్దాం’’ అని వారన్నారు.

    తర్వాత రిషభ్ పంత్ వస్తువులను, నగదును దొంగలించినట్లు వస్తున్న వార్తాలు అవాస్తవమని హరిద్వార్ ఎస్‌పీ తెలిపారు. ఆయన ప్లాటినం చెయిన్, గోల్డ్ బ్రాస్‌లెట్, రూ.4000 నగదును వారి కుటుంబానికి అప్పజెప్పామని చెప్పారు.

    రిషభ్ పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్ సుశిల్ కుమార్, కండక్టర్ పరమ్‌జీత్‌లను పానిపట్ బస్సు డిపార్ట్‌మెంట్ సత్కరించింది.

    గురుకుల్ నార్సన్ సమీపంలోని డివైడర్‌ను ఢీకొంటూ ఒక కారు అదుపు తప్పింది. ప్రమాదానికి గురైన కారులో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు వారు కారు వద్దకు పరుగులు తీసినట్టు తెలిపారు.

    ‘రిషభ్ పంత్‌ను మేము బయటికి లాగిన 5 నుంచి 7 సెకన్లలోనే కారుకి మంటలంటుకున్నాయి. అతనికి వెనుకవైపు తీవ్రంగా గాయాలయ్యాయి. మేము అతని గురించి అడగగా..తానొక భారత క్రికెటర్‌నని చెప్పాడు’’ అని రిషభ్ పంత్‌ను కాపాడిన బస్సు కండక్టర్ పరమ్‌జీత్ తెలిపాడు.

  2. గుజరాత్‌లోని నవ్సారిలో ఘోర రోడ్డు ప్రమాదం, 9మంది మృతి

    గుజరాత్‌లోని నవ్సారిలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీకొట్టుకోవడంతో 9 మంది మరణించగా, పలువురికి గాయాలైనట్టు ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది.

    ‘‘అహ్మదాబాద్-ముంబై జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న బస్సు, ఎస్‌యూవీలు ఢీకొన్నాయి. 9 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది’’ అని డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు వీఎన్ పటేల్ తెలిపారు.

    ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు. ‘‘గుజరాత్‌లోని నవ్సారిలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నా. ప్రమాదంలో గాయాలు పాలైన వారికి స్థానిక సిబ్బంది వెంటనే చికిత్స అందిస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

  3. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.