చైనా సరిహద్దులోని తవాంగ్ సెక్టార్లో ప్రస్తుతం
పరిస్థితి నియంత్రణలో ఉన్నట్లు లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలితా తెలిపారు.
‘వాస్తవ నియంత్రణ రేఖను దాటి చైనా బలగాలు వచ్చాయి.
వారిని అడ్డుకునే ప్రయత్నంలో చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని గాయాలు
అయ్యాయి.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రెండు దేశాల
సైనిక ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉంది’
అని ఆయన అన్నారు.
సైనికులుగా దేశాన్ని రక్షించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని లెఫ్టినెంట్ జనరల్ తెలిపారు.
విజయ్ దివస్ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలితా
మాట్లాడారు.
1971 యుద్ధంలో పాకిస్తాన్ మీద భారత్ సాధించిన
విజయగానికి గుర్తుగా ‘విజయ్ దివస్’ను జరుపుతున్నారు. ఈ యుద్ధం తరువాత బంగ్లాదేశ్
దేశం ఏర్పడింది.