లైవ్ పేజీ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అపేడేట్స్తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
దిల్లీ మద్యం ‘కుంభకోణం’ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితను బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో సీబీఐ ఆమెను సుమారు 7గంటలు ప్రశ్నించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అపేడేట్స్తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/Facebook
దిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ ఎం.ఎల్.సీ కల్వకుంట్ల కవితను, సీబీఐ అధికారులు ప్రశ్నించడం అయిపోయింది.
సుమారు ఏడు గంటల పాటు కవితను ప్రశ్నించిన అధికారులు ఇప్పుడే ఆమె నివాసం నుంచి వెళ్లిపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ఆఫ్రికా దేశమైన జాంబియాలో రోడ్డు పక్కన 27 మృతదేహాలు లభించాయి.
ఇథియోపియా నుంచి వస్తున్న వలసదారులుగా వారిని భావిస్తున్నారు. ప్రయాణం చేసే సమయంలో ఊపిరి ఆడక వారు చనిపోయి ఉంటారని, దాంతో వారి మృతదేహాలను ఇక్కడ రోడ్డు పక్కన పడేసి ఉండొచ్చని పోలీసులు బీబీసీకి తెలిపారు.
రోడ్డు పక్కన పడేసిన మృతదేహాల్లో ఒక వ్యక్తి కొన ఊపిరితో కనిపించగా... ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.
దక్షిణాఫ్రికాకు వలసదారులను తరలించడానికి జాంబియా ప్రధానంగా మార్గంగా ఉంది.

ఫొటో సోర్స్, Facebook/Konda Surekha
తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తనకు స్థానం లభించకపోవడం మనస్తాపం కలిగించిందని ఆమె తన రాజీనామా లేఖలో రాశారు. అలాగే వరంగల్ నుంచి ఏ ఒక్క నేతకూ రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు లేకపోవడం బాధించిందని తెలిపారు.
అందువల్ల ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపిన లేఖలో కొండా సురేఖ పేర్కొన్నారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితను బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, కవిత నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేసులో వివరణ కోసం సమావేశం కావడానికి సీబీఐ అధికారులు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాస పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.

దిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన వివాదంలో కవిత పేరును బీజేపీ నాయకులు ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
కాగా, కేసీఆర్ జాతీయ స్థాయి ఎదుగుదలను అడ్డుకోవడానికే ఈ కుట్రలు పన్నుతున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది.

ఫొటో సోర్స్, @nitin_gadkari
నాగ్పూర్-బిలాస్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ప్రధాని నరేంద్ర మోదీ పచ్చ జెండా ఊపారు.
ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు కూడా హాజరయ్యారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అనంతరం ప్రధానమంత్రి నాగపూర్లోని ఫ్రీడం పార్క్ మెట్రో స్టేషన్ను సందర్శించారు.
మెట్రోలో ప్రధాని విద్యార్థులతో, ఇతర ప్రయాణికులతో సంభాషించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, UGC
వైఎస్ షర్మిల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమెను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.
షర్మిల హైదరాబాదులోని తన పార్టీ కార్యాలయం ముందు ఆమరణ నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.
నిన్న అపోలో వైద్యులు ఆమెకు పరీక్షలు జరిపారు. ఆమె మంచి నీళ్ళు కూడా తాగట్లేదని, శరీరం డీహైడ్రేషన్కు గురవుతోందని, ఇదిలా కొనసాగితే కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని అపోలో డాక్టర్ చంద్ర శేఖర్ చెప్పారు.
కాగా, పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని షర్మిల శనివారం ఉదయం మీడియాతో చెప్పారు.
శనివారం రాత్రి పోలీసులు షర్మిల దీక్షను భగ్నం చేసి, ఆమెను అపోలోకు తరలించారు.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.