జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం

ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చినా వృద్ధిలో భారీగా తగ్గుదల నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్ వరకు జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతం నమోదైంది.

లైవ్ కవరేజీ

  1. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ‘వల్గర్’ అనడం మీద కశ్మీర్ పండితుల నిరసన

    ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా మీద ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జూరీ చైర్మన్ నడవ్ లపిడ్ చేసిన వివాదాస్పద కామెంట్స్‌కు నిరసనగా జమ్మూలో కశ్మీరీ పండితులు ఆందోళనకు దిగారు.

    ‘కశ్మీర్ ఫైల్స్‌లో చూపించింది 5శాతం మాత్రమే. 95శాతం చూపించలేదు. ఇజ్రాయెల్ రాయబారి ఆ వ్యాఖ్యలను ఖండించడాన్ని ఆహ్వానిస్తున్నాం’ అని యోగేశ్ పండిట్ అనే వ్యక్తి అన్నారు.

    ‘ఆయన వ్యాఖ్యలతో మా గాయాలకు మరింత కారం పూసినట్లు అయింది’ అని రంజన్ అనే వ్యక్తి చెప్పారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. డిజిటల్ పేమెంట్స్: ఫోన్‌పే, పేటీఎం వాడుతున్నారా? మీ ఖాతాలు వేరొకరికి చిక్కకుండా ఎలా జాగ్రత్తపడాలి?

  3. షర్మిల అరెస్టు మీద తెలంగాణ గవర్నర్ తమిళసై ఆందోళన

    తెలంగాణ గవర్నర్ తమిళ సై

    ఫొటో సోర్స్, Tamilisai Soundararajan/Facebook

    వైఎస్ షర్మిల కూర్చొని ఉన్న కారును తెలంగాణ పోలీసులు లాక్కుని వెళ్లడం మీద ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై స్పందించారు.

    అలా లాక్కొని వెళ్లిన దృశ్యాలు కలిచి వేశాయని ఆమె అన్నారు. నిన్న జరిగిన ఘటన మీద ఆమె ఆందోళన వ్యక్తం చేశారు అని రాజ్‌భవన్ ప్రకటించింది.

  4. డిజిటల్ రూపీ గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

  5. బ్రేకింగ్ న్యూస్, భారత్ X న్యూజీలాండ్: టీం ఇండియా 219 పరుగులకు ఆలౌట్

    న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీం ఇండియా 219 పరుగులకు ఆలౌట్ అయింది.

    వాషింగ్టన్ సుందర్ 64 బంతుల్లో 51 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 59 బంతుల్లో 49 పరుగులు చేశాడు.

    మిగతా ప్లేయర్స్ ఎవరూ పెద్దగా రాణించలేదు.

    న్యూజీలాండ్ బౌలర్లలో ఆడం, డార్లీ మిచెల్ 3 వికెట్ల చొప్పున తీశారు.

  6. ‘66 సగటు ఉన్న ఆటగాడిని పక్కన కూర్చోబెడతారా?’

    క్రికెటర్ సంజు శాంసన్

    ఫొటో సోర్స్, Getty Images

    న్యూజీలాండ్ సిరీస్‌లో సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోక పోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విమర్శించారు.

    రిషభ్ పంత్‌ స్థానంలో సంజు శాంసన్‌ను తీసుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

    కొద్ది రోజులుగా రిషభ్ పంత్‌ సరిగ్గా ఆడలేక పోతున్నాడు. న్యూజీలాండ్ సిరీస్‌లోనూ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. అయినా మూడో వన్డేకు సంజు శాంసన్‌ను పక్కన పెట్టి రిషభ్ పంత్‌ను తీసుకున్నారు.

    అయితే 4వ స్థానంలో రిషభ్ పంత్ బాగా ఆడుతున్నాడని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.

    రాహుల్ ద్రావిడ్ విరామం తీసుకోవడంతో ప్రస్తుతం టీం ఇండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు.

    వీవీఎస్ లక్ష్మణ్ వ్యాఖ్యలను శశి థరూర్ ఖండించారు.

    ‘4వ స్థానంలో బాగా ఆడాడు అని వీవీఎస్ లక్ష్మణ్ చెబుతున్నారు. అతను మంచి ప్లేయరే కాకపోతే ఫాం కోల్పోయాడు. గత 11 ఇన్నింగ్సులకు గాను పదింటిలో అతను విఫలమయ్యాడు. వన్డేలలో శాంసన్ సగటు 66. చివరి 5 మ్యాచుల్లో అతను పరుగులు చేశాడు. అయినా బెంచ్‌కే పరిమతమయ్యాడు’ అని శశి థరూర్ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడాలంటే హడల్, 17 ఏళ్లుగా విదేశీ జట్లు ఎందుకు భయపడ్డాయి?

  8. టయోటా భారత్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ మరణం

    టయోటా భారత్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్

    ఫొటో సోర్స్, Vikram Kirloskar/Twitter

    టయోటా కిర్లోస్కర్ మోటార్స్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్(64) మరణించినట్లు ఆ సంస్థ తెలిపింది.

    ఆయన గుండె పోటుతో చనిపోయినట్లు వార్తా పత్రిక ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.

  9. భారత్ X న్యూజీలాండ్: 131 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన టీం ఇండియా

    న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 27.5 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది.

    కెప్టెన్ శిఖర్ ధవన్‌తో పాటు ఓపెనర్ శుభమన్ గిల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ రాణించలేదు.

    శ్రేయస్ అయ్యర్ మాత్రమే 59 బంతుల్లో 49 పరుగులు చేసి అవుటయ్యాడు.

    న్యూజీలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నీ 3 వికెట్లు తీశాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. అమెరికా: సేమ్ సెక్స్ వివాహాల బిల్లుకు సెనేట్ ఆమోదం

    అమెరికా కోర్టు ముందు ఎల్‌జీబీటీ కార్యకర్తల నిరసనలు

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలో సేమ్ సెక్స్ వివాహాల బిల్లును సెనేట్ ఆమోదించింది.

    61-36 తేడాతో బిల్లు ఆమోదం పొందగా 12 మంది రిపబ్లికన్లు ఈ బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు.

    ఆ తరువాత ఈ బిల్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందాక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేస్తే అది చట్టంగా మారుతుంది.

    అయితే సేమ్ సెక్స్ వివాహాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా చట్టబద్ధం చేయాలని ఈ బిల్లు చెప్పడం లేదు.

    ఈ ఏడాది జూన్‌లో అబార్షన్ చేయించుకునే హక్కును సుప్రీం కోర్టు రద్దు చేసిన తరువాత సేమ్ సెక్స్ వివాహాలను కూడా నిషేధిస్తారనే ఆందోళన మరింత పెరిగింది.

  11. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.