ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం.. అర్జెంటీనాపై సౌదీ అరేబియా విజయం

ఫిఫా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అర్జెంటీనా జట్టును 53వ స్థానంలో ఉన్న సౌదీ అరేబియా జట్టు ఓడించి, సంచలన విజయం నమోదు చేసింది

లైవ్ కవరేజీ

  1. ట్రంప్ సుంకాలు తట్టుకున్న చైనా.. ఇరాన్ యుద్ధంతో నష్టపోతోందా?

  2. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటిన ఉష్ణోగ్రతలు, నార్త్ ఇండియాలో వడగాలుల తీవ్రతను చూపే 8 చిత్రాలు

  3. మనిషిని ‘నిషేధించిన’ చోట స్వేచ్ఛగా వృద్ధి చెందుతున్న వన్యప్రాణులు.. యుక్రెయిన్, కొరియాల్లోని ప్రమాదకర ప్రాంతాల్లో జీవవైవిధ్యం

  4. తెలంగాణ: 'ఆర్టీసీ సమ్మె విరమణ, శనివారం నుంచి యథావిధిగా బస్సుల రాకపోకలు'

  5. బ్రెజిల్‌లో కొండ కింద పోలీస్ ఆపరేషన్.. కొండపై చిక్కుకుపోయిన టూరిస్ట్‌లు..

  6. రాఘవ్ చడ్డా: సామాన్యుల కోసమంటూ ఇటీవల రాజ్యసభలో అనేక ప్రశ్నలు లేవనెత్తిన ఈ నేత బీజేపీలో చేరుతూ ఏం చెప్పారు?

  7. ‘ఫ్యాట్‌ జైల్’: ఊబకాయాన్ని తగ్గిస్తామని చెప్పే ఈ కేంద్రాలలో పరిస్థితులు ఎలా ఉంటాయి? నిపుణుల ఆందోళన ఏంటి?

  8. బల్లులంటే మనుషులకు ఎందుకు భయం, అవి లేకపోతే ఏమవుతుంది?

  9. అనంతపురంలో దళితుడిని ఎస్సై కొడుతున్నట్లుగా వీడియో వైరల్.. అక్కడ అసలు ఏం జరిగింది?

  10. భారత్‌కు మద్దతుగా ఇరాన్, ట్రంప్ వివాదాస్పద పోస్ట్‌పై తీవ్ర ప్రతిస్పందన

  11. మటన్ లివర్ తింటే మన లివర్‌కు మంచిదా? ఎవరు తినకూడదు?

  12. బెంగళూరు: ప్రియుడిని BDSM సెక్స్ కోసమని పిలిచి ప్రియురాలు చంపేసిందా?

  13. 'భూతల నరకకూపం': భారత్‌ గురించి వివాదాస్పద పోస్ట్ షేర్ చేసిన ట్రంప్, ఇండియా ఏమందంటే..

  14. మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితుల విడుదల - దర్యాప్తు సంస్థలు భిన్నమైన రిపోర్టులు ఇవ్వడంపై బాంబే హైకోర్టు ఏమన్నది?

  15. పిఠాపురం: ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య వివాదం ఏంటి?

  16. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలు నిజం కాదు: కేంద్రం స్పష్టత

    పెట్రోల్, డీజిల్ ధరలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది.

    పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ. 25-28 మేర పెరగొచ్చంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలను ఈ సందర్భంగా కొట్టి పారేసింది. అలాంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం పరిశీలనలో లేదని పెట్రోలియం శాఖ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొంది.

    అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఆ భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం, చమురు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది.

  17. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ బూత్ సమీపంలో బాంబు పేలుడు వార్తలు

    పశ్చిమ బెంగాల్‌

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

    పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభమైన తర్వాత వేర్వేరు ప్రాంతాలలో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

    ముర్షిదాబాద్ జిల్లాలోని డోంకల్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. దీంతో స్థానికులు బూత్ నంబర్ 217 వద్ద ఓటు వేయడానికి వెళ్లలేకపోయారు.

    బీబీసీ బంగ్లా కథనం ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ముర్షిదాబాద్ పోలీసులు.. ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని మైకుల ద్వారా విజ్ఞప్తి చేశారు. వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

    ముర్షిదాబాద్ జిల్లాలో నౌదా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివనగర్‌లో ఒక పోలింగ్ కేంద్రం సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

    మరోవైపు, మాల్దా జిల్లాలోని మోతాబారిలో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు అక్కడికి చేరుకోగా, వారు ఆలస్యంగా వచ్చారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

  18. చెన్నైలో ఓటేసిన రజనీ, విజయ్, అజిత్

    రజనీకాంత్, తమిళనాడు ఎన్నికలు

    ఫొటో సోర్స్, ANI

    నటుడు రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మారిస్ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    అలాగే, నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.

    టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ చెన్నైలోని నీలంకరై పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    ఎంఎన్ఎం చీఫ్, నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్‌తో కలిసి చెన్నైలో ఓటు వేశారు.

    అజిత్ కుమార్

    ఫొటో సోర్స్, ANI

  19. అమెరికాతో చర్చలకు ఇరాన్ ఎందుకు ఆసక్తి చూపడం లేదు, తెరవెనుక ఏం జరుగుతోంది?

    అమెరికా, చర్చలు, ఇరాన్

    ఫొటో సోర్స్, Getty Images

    కాల్పుల విరమణ పొడిగించినప్పటికీ, ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో ప్రతినిధి బృందాన్ని పాకిస్తాన్‌కు పంపుతున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతంలోనే ప్రకటించారు.

    నిజానికి వాన్స్ బుధవారం ఉదయం పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉందని అమెరికా మీడియా తెలిపింది. అయితే, ఆయన పర్యటన రద్దయింది, ఎందుకంటే అమెరికా ప్రతినిధి బృందం వచ్చినప్పుడు మీటింగ్ టేబుల్ వద్ద ఇరాన్ నుంచి ఎవరైనా ఉంటారా లేదా అనే ప్రశ్నకు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్ వద్ద కూడా ఇప్పటివరకు సమాధానం లేదు.

    చర్చలకు ప్రతినిధులను పంపడం తప్ప ఇరాన్‌కు మరో మార్గం లేదని ట్రంప్ మంగళవారం ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అమెరికాతో చర్చలపై ఇరాన్ అధికారుల నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదు.

    ఈ నేపథ్యంలో, రెండో విడత చర్చల్లో ఇరాన్ ఎందుకు పాల్గొనడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    దీనికి సంబంధించిన పూర్తి కథనం ఇక్కడ చదవండి.

  20. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో నేడే పోలింగ్

    తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ పోలింగ్

    ఫొటో సోర్స్, Rupak De Chowdhuri/NurPhoto via Getty Images

    ఫొటో క్యాప్షన్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ముందు వీవీప్యాట్ యంత్రాలను తీసుకువెళ్తున్న ఎన్నికల సిబ్బంది

    పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత, తమిళనాడులో మొత్తం అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.

    పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలుండగా మొదటి విడతలో 152 నియోజకవర్గాలకు, తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

    బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ - బీజేపీ మధ్య ప్రత్యక్ష పోరు కనిపిస్తుండగా, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది.