సావర్కర్ను కించపరిచారంటూ రాహుల్ గాంధీపై కేసు నమోదు
భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై మహారాష్ట్రలో కేసు నమోదైంది.
స్వతంత్ర్య పోరాటయోధుడు వీడీ సావర్కర్పై కించపరిచేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బాలాసాహెబంచి శివసేన నాయకురాలు వందన డోంగ్రే గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
స్థానికుల మనోభావాలను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు థానే నగర్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 500, 501 కింద నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కేసు నమోదైంది.