యుక్రెయిన్ యుద్ధం: రష్యా క్షిపణి పోలాండ్లో పడటంతో ఇద్దరి మృతి
తమ భాభాగంపై మంగళవారం మధ్యాహ్నం 3:40 గంటలకు రష్యాకు చెందిన ఒక క్షిపణి పడటంతో ఇద్దరు మృతి చెందారని పోలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే, ఆ క్షిపణిని ఎవరూ ప్రయోగించారనే అంశంపై తమ వద్ద ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవని పోలాండ్ తెలిపింది.
ఈ ఘటనపై ‘అత్యవసర వివరణాత్మక నివేదిక’ ఇవ్వాలని పోలాండ్లోని రష్యా రాయబారిని కోరినట్లు పోలాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లుకాజ్ జసినా తెలిపారు.
క్షిపణి పడిన సెరెవోడా గ్రామం యుక్రెయిన్-పోలాండ్ సరిహద్దుల్లో ఉంది.
అయితే, ఈ దాడిని రష్యా ఖండించింది.
‘‘యుక్రెయిన్-పోలాండ్’’ సరిహద్దు సమీపంలోని లక్ష్యాలపై రష్యా ఎటువంటి దాడులు నిర్వహించలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
‘పరిస్థితిని మరింత దిగజార్చాలనే ఉద్దేశంతో, రెచ్చగొట్టేందుకు చేసే ప్రయత్నాలు ఇవి’ అని రష్యా పేర్కొంది.