ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఇది కాక, 2022 టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 98.67 సగటుతో మొత్తం 296 పరుగులు చేశాడు.
టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేయడం ఇది రెండోసారి. అంతకుముందు, 2014 టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేశాడు. 2014లో కోహ్లీ 6 మ్యాచ్లలో 106.33 సగటుతో 319 పరుగులు చేశాడు. అయితే, ఇందులో ఫైనల్స్లో భారత్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
ఇది కాకుండా, ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డ్ సాధించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 1016 పరుగుల రికార్డును అధిగమించాడు.
జీ20లో సదస్సులో పాల్గొనేందుకు బాలీ చేరుకున్న ప్రధాని మోదీ
"బాలీ సదస్సులో, ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడం, ఆహారం భద్రత, ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి కీలక అంశాలపై జీ20 నాయకులతో చర్చిస్తాను" అని బాలీ పర్యటనకు బయలుదేరే ముందు మోదీ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
టీ20లో పాకిస్తాన్ ఓడిపోవడంతో పంజాబ్లోని మోగాలో విద్యార్థుల మధ్య ఘర్షణలు
పంజాబ్లోని మోగాలో ఒక కాలేజీలో టీ20 మ్యచ్ ఫైనల్ చూస్తున్న విద్యార్థుల మధ్య ఘర్షణలు చెలరేగాయి.
పాకిస్తాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ గెలిచిన తరువాత, బిహార్, కశ్మీర్ విద్యార్థులు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారని పోలీసు అధికారులు చెప్పారు. కొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలైనట్లు పోలీసు అధికారులు తెలిపారని పీటీఐ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
మోగాలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీ విద్యార్థులు అంతా కలిసి కూర్చుని మ్యాచ్ చూస్తుండగా, పాకిస్తాన్ ఓటమితో బిహార్, కశ్మీర్ విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
కొద్దిసేపటికే అది తోపులాటకు దారితీసిందని, ఆపై ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, ఇటుకలతో దాడి చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం కాలేజీకి పోలీసు కాపలా పెట్టారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
విద్యార్థుల మధ్య ఘర్షణలకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో ఒకరిపై ఒకరు ఇటుకలు, రాళ్లు రువ్వుకోవడం కనిపిస్తోంది.
స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ జస్వీందర్ సింగ్ ఏఎన్ఐతో మాట్లాడుతూ, “లాలా లజపత్ రాయ్ కాలేజీలో రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఎలాంటి నినాదాలు చేసినట్లు రిపోర్ట్ లేదు" అని చెప్పారు.
అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను ఎలా గుర్తించాలి, ఎల్ఆర్ఎస్తో ఉపయోగం ఉంటుందా?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కలిసి ఒక టాక్ షోను నిర్వహించనున్నారు.
దీని పేరు 'ది మీర్జా మాలిక్ షో'.
పాకిస్తానీ ఛానల్ 'ఉర్దుఫ్లిక్స్ అఫీషియల్'లో ఈ కార్యక్రమం ప్రసారం రానుంది. ఛానెల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో టాక్ షో పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ కనిపిస్తున్నారు.
'ది మిర్జా మాలిక్ షో అతి త్వరలో ఉర్దూఫ్లిక్స్లో మాత్రమే' అని పోస్టర్’లో రాశారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్ల కంటెంట్కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of Instagram ముగిసింది
ఈ జంట విడిపోతున్నట్లు గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, కొత్త టాక్ షో ప్రకటనతో ఈ వదంతులకు తెరపడింది.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ దుబాయ్లో స్థిరపడ్డారు. 2018లో వారికి ఇజాన్ పుట్టాడు.
ఈ జంట వివాహ బంధంలో కష్టాలు ఎదుర్కొంటోందని ఒక వారం క్రితం పాకిస్తాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ, షోయబ్, సానియా దీనిపై స్పందించలేదు. వారి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.