రాహుల్ గాంధీ పాదయాత్రలో పిల్లలతో పరుగు పందెం...

ఫొటో సోర్స్, UGC
భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఆదివారం ఉదయం కొందరు పిల్లల బృందంతో పరుగు పందెం చేశారు.
పిల్లలతో కలిసి రాహుల్ పరుగు తీయటం, వారి వెనుకే కాంగ్రెస్ నాయకులు కూడా పరుగు పెట్టటం దృశ్యాల వీడియోలను కాంగ్రెస్ పార్టీ, నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గొల్లపల్లి వద్ద యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. తన వద్దకు వచ్చిన పిల్లలతో మాట్లాడారు. అంతలోనే ‘రేస్ లగావోగే’ అని వారితో మాట్లాడుతూ పరుగు అందుకోవటం ఆ వీడియోలో కనిపిస్తోంది.
ప్రస్తుతం 52 ఏళ్ల వయసున్న రాహుల్తో పాటు ఆ పిల్లలు కూడా పరుగు అందుకున్నారు. వారితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా పరుగుతీశారు.
రాహుల్ పరుగు పందెం వీడియో సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది





