బీసీసీఐ అధ్యక్షుడిగా ఎవరూ శాశ్వతంగా ఉండిపోలేరు - సౌరవ్ గంగూలీ

"శాశ్వతంగా ఎవరూ ఆడలేరు, అధ్యక్షునిగా కూడా శాశ్వతంగా ఉండలేరు" అని బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. టీ20 ప్రపంచకప్: భారత జట్టులో చేరేందుకు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌ ఆస్ట్రేలియా ప్రయాణం

    క్రికెట్

    ఫొటో సోర్స్, Getty Images

    టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో చేరేందుకు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ గురువారం ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.

    గాయాలతో ఈ టోర్నమెంటుకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో వీరిలో ఎవరిని తీసుకోవాలన్నది బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు. ఆసక్తికరంగా, రిజర్వ్ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, రవి విష్ణోయ్, దీపక్ చాహర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లడం లేదు. చాహర్ వెన్ను గాయంతో అందుబాటులో లేడని చెబుతున్నారు.

    భారత జట్టు అక్టోబర్ 6న భారత్ నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరింది. ప్రస్తుతం పెర్త్‌లో టీమిండియా టోర్నమెంటుకు సిద్ధమవుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడుతోంది.

    బూమ్రా దక్షిణాఫ్రికాతో జరిగిన ట్20 సిరీస్‌లో గాయపడ్డాడు. దాంతో, ఈ వరల్ద్ కప్‌కు దూరమవుతున్నాడు.

    షమీ ఫిట్‌నెస్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తరుగ్వాతే బుమ్రా స్థానంలో అతడిని తీసుకోవడంపై భారత జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.

    షమీ 2021 నవంబర్ నుంచి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడలేదు. అయితే, కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నాడు.

    భారత టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్

  2. యుక్రెయిన్‌కు క్షిపణులు పంపించనున్న నాటో మిత్రదేశాలు

    నాటో

    ఫొటో సోర్స్, GENERAL STAFF OF UKRAINE'S ARMED FORCES

    యుక్రెయిన్‌పై రష్యా తాజా క్షిపణి దాడుల తరువాత, నాటో మిత్రదేశాలు కీయెవ్‌కు అధునాతన ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించాయి.

    బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాలు యుక్రెయిన్‌కు క్షిపణులు, రాడార్స్ పంపిస్తామని హామీ ఇచ్చాయి. అంతకుముందు అమెరికా కూడా యుక్రెయిన్‌కు క్షిపణులు పంపించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే జర్మనీ యుక్రెయిన్‌కు హై-టెక్ వ్యవస్థను పంపించింది.

    50 దేశాలు బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో సమావేశమై, యుక్రెయిన్‌కు ఈ హామీలు ఇచ్చాయి.

    ఈ సదస్సు "చారిత్రాత్మకమని" యుక్రెయిన్ పేర్కొంది.

    యుక్రెయిన్‌

    ఫొటో సోర్స్, Getty Images

    సోమ, మంగళవారాలలో రష్యా, యుక్రెయిన్‌పై 100 కంటే ఎక్కువ క్షిపణులు, డజన్ల కొద్దీ డ్రోన్లు ప్రయోగించిందని యుక్రెయిన్ తెలిపింది. ఎనర్జీ ఇంఫ్రాస్ట్రక్చర్, సైనికేతర విభాగాలను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది.

    తాజా దాడుల మొదటి రోజే కనీసం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. యుక్రెయిన్‌లోని పలు నగారాల్లో విద్యుత్, నీటి సరఫరాలలో అంతరాయం కలిగింది.

    శనివారం క్రైమియా బ్రిడ్జిని పేల్చినందుకు నిరసనగా ఈ దాడులు జరిపినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. యుక్రెయిన్ గూఢచార సంస్థ ఈ ఆపరేషన్ నిర్వహించిందని రష్యా ఆరోపించింది. అయితే, ఈ వాదనలను యుక్రెయిన్ తిరస్కరించింది.

  3. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు, విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి.