ఎస్సీఓ సదస్సు తరువాత తొలిసారి బయట కనిపించిన షీ జిన్పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమర్కండ్ ఎస్సీఓ సదస్సు తరువాత తొలిసారి బహిరంగంగా కనిపించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూడటానికి ఆయన వచ్చారు.
చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, షీ జిన్పింగ్ను హౌస్ అరెస్టు చేశారనే ఊహాగానాలు ఇటీవల వినిపించాయి.
వచ్చే నెల 16న చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ సమావేశం జరుగనుంది. మూడోసారీ కూడా షీ జిన్పింగ్ను చైనా అధ్యక్షునిగా ఎన్నుకుంటారని భావిస్తున్నారు.