కేటీఆర్: ‘నేను ఇంత వరకు ఓట్ల కోసం చుక్క మందు పంచలేదు... పైసా డబ్బులు ఇవ్వలేదు’

సిరిసిల్లలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ ప్రోగ్రాం కింద విద్యార్థులకు ట్యాబ్స్ అందజేశారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎన్నికల్లో మందు పంచను, డబ్బులు ఇవ్వనని అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ఇరాన్‌లో కొనసాగుతున్న ‘హిజాబ్’ నిరసనలు

    ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు

    ఫొటో సోర్స్, REX/Shutterstock

    ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు

    ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు అయిదో రోజుకు చేరుకున్నాయి. హిజాబ్‌ను తగలబెట్టడం కొనసాగుతోంది.

    హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించింది అంటూ 22ఏళ్ల మాషా అమిని అరెస్టు చేయగా కస్టడీలో ఆమె చనిపోయారు.

    కస్టడీలో పోలీసులు ఆమెను తీవ్రంగా కొట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. నాటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి.

    తెహ్రాన్, తాలేష్, మషాద్, జహేదాన్, అహ్‌వాజ్, సిర్జన్, అమోల్, కేషమ్, నౌషహర్ వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసనలు జరుగుతున్నాయి. చాలా చోట్ల పోలీసులతో నిరసనకారులు ఘర్షణలకు దిగుతున్నారు.

    ఈ నేపథ్యంలో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను నిలిపి వేశారు.

    బహిరంగ ప్రదేశాల్లో బాగా వదులుగా ఉండే దుస్తులు ధరించినందుకు ఇతర మహిళలతో పాటు మాషాను అదుపులోకి తీసుకున్నామని, గుండె సమస్యతో ఆ యువతి చనిపోయిందని మోరల్ పోలీసులు చెబుతున్నారు.

    ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు

    ఫొటో సోర్స్, Socialmedia UGC

    ఫొటో క్యాప్షన్, ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసనలు
  2. శ్రీకాకుళంలో చీమల దండు: ఆ ఊరిపై ఎర్ర చీమలు ఎందుకు దాడి చేస్తున్నాయి, ఇవి మనుషులకు ఎంత ప్రమాదకరం?

  3. నీరా రాడియ టేపుల కేసులో ‘నేరం’ జరగలేదు:సీబీఐ

    నీరా రాడియ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, నీరా రాడియ(ఫైల్ ఫొటో)

    సుమారు 12 ఏళ్ల కిందట 2జీ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీరా రాడియా టేపుల కేసులో ఎటువంటి నేరం జరగలేదని సుప్రీం కోర్టుకు సీబీఐ తెలిపింది.

    టేపుల్లోని సంభాషణలను తాము విచారించామని వాటికి సంబంధించి ఎటువంటి నేరపూరిత కార్యకలాపాలు జరగలేదని వెల్లడించింది.

    ఈమేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ విన్నవించారు.

    గత యూపీఏ ప్రభుత్వ హాయంలో కార్పొరేట్ లాబీలు చేసే నీరా రాడియాతో నాటి కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, సీనియర్ జర్నలిస్టులు జరిపిన సంభాషణలు మీడియాకు లీక్ అయ్యాయి.

    మనీలాండరింగ్‌కు సంబంధించి 2008-09లో ఆదాయపు పన్ను శాఖ నీరా రాడియా ఫోన్‌ను ట్యాప్ చేసింది.

    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణా నిధి కూతురు కనిమొళి, డీఎంకే నేత ఎ.రాజా, మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, సీనియర్ జర్నలిస్టు బర్ఖా దత్, రతన్ టాటా వంటి వారి పేర్లు ప్రధానంగా ఈ కేసులో వినిపించాయి.

  4. వడ్డీ రేట్లు పెంచిన ఫెడరల్ రిజర్వ్... మరింత పడిపోయిన రూపాయి

    అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచిన తరుణంలో రూపాయి విలువ పడిపోయింది.

    డాలరుతో పోలిస్తే రూపాయి విలువ జీవిత కాల కనిష్టం 80.45ని తాకి ఆ తరువాత కాస్త కోలుకుని 80.25 వద్ద ట్రేడ్ అవుతోంది.

    అమెరికా వడ్డీ రేట్లను 3-3.25శాతం రేంజ్‌కు పెంచుతూ ఫెడరల్ రిజ్వర్ నిర్ణయం తీసుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. హైదరాబాద్: చాంద్రయణగుట్టలోని పీఎఫ్‌ఐ కార్యాలయం సీజ్

    హైదరాబాద్‌లోని చాంద్రయాణగుట్టలో గల పీఎఫ్‌ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు

    ఫొటో సోర్స్, ANI

    హైదరాబాద్‌లోని చాంద్రయణగుట్టలో గల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) ప్రధాన కార్యాలయాన్ని ఎన్‌ఐఏ సీజ్ చేసింది.

    మరొకవైపు ఎన్‌ఐఏ దాడులకు నిరసనగా చెన్నైలో పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాల మీద ఎన్ఐఏ దాడులు

    పోలీసుల పహారా

    ఫొటో సోర్స్, ANI

    దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యాలయాల మీద నేషనల్ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఈడీ ఏక కాలంలో దాడులు చేశాయి.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు సుమారు 10 రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి.

    100 మందికిపైగా పీఎఫ్ఐ నేతలను అరెస్టు చేశారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో దాడులకు నిరసనగా పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసనలకు దిగారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.