‘యుక్రెయిన్ డ్యాం మీద రష్యా మిసైల్స్ దాడి’
దక్షిణ యుక్రెయిన్లోని ఒక డ్యామ్ మీద రష్యా మిసైళ్లు దాడి చేశాయని ఆ దేశ అధికారులు తెలిపారు.
డ్యామ్కు చుట్టుపక్కన ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించామని, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని వెల్లడించారు.
ఈ డ్యామ్ క్రివ్యి రిహ్ సిటీలో ఉంది. యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలియెన్స్కీ ఇక్కడే పుట్టారు.
డ్యామ్ మీద దాడి జరిగిన నేపథ్యంలో రష్యాను ‘టెర్రరిస్ట్ స్టేట్’గా జెలియెన్స్కీ అభివర్ణించారు.