‘సీఎం కేసీఆర్ ఎందుకు రావడం లేదు... రాజ్‌భవన్ అంటరాని స్థలమా?’

రాజ్‌భవన్ అంటరాని స్థలమా? ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడకు రావడం లేదు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు.

లైవ్ కవరేజీ

  1. నేడు ఇండియా గేట్ వద్ద బోస్ విగ్రహం ఆవిష్కరణ

    సుభాష్ చంద్రబోస్

    ఫొటో సోర్స్, Netaji Research Bureau

    దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.

    ఇండియా గేట్ కనోపీ కింద 28 అడుగుల నేతాజీ గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా చేతులతోనే ఆ శిల్పాన్ని చెక్కినట్లు అధికారులు వివరించారు.

    తెలంగాణలోని ఖమ్మం నుంచి గ్రానెట్ రాయిని తీసుకొచ్చామని, ఇందుకు 140 చక్రాలతో 100 అడుగుల పొడవు ఉన్న ట్రక్కును ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలిపారు.

    అలాగే సుందరీకరించిన కర్తవ్యపథ్‌ను కూడా సందర్శకుల కోసం నేడు ప్రధాని ప్రారంభించనున్నారు. రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చారు.

  2. హలో, గుడ్ మార్నింగ్!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.