నేడు ఇండియా గేట్ వద్ద బోస్ విగ్రహం ఆవిష్కరణ
దిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు.
ఇండియా గేట్ కనోపీ కింద 28 అడుగుల నేతాజీ గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా చేతులతోనే ఆ శిల్పాన్ని చెక్కినట్లు అధికారులు వివరించారు.
తెలంగాణలోని ఖమ్మం నుంచి గ్రానెట్ రాయిని తీసుకొచ్చామని, ఇందుకు 140 చక్రాలతో 100 అడుగుల పొడవు ఉన్న ట్రక్కును ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలిపారు.
అలాగే సుందరీకరించిన కర్తవ్యపథ్ను కూడా సందర్శకుల కోసం నేడు ప్రధాని ప్రారంభించనున్నారు. రాజ్పథ్ పేరును కర్తవ్యపథ్గా మార్చారు.