ఝార్ఖండ్లో 14ఏళ్లగిరిజన బాలిక హత్య

బీబీసీ రాంచీ నుంచి రవి ప్రకాష్
ఝార్ఖండ్లో 14ఏళ్ల గిరిజన బాలిక హత్యతో సంబంధం ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక మరణం ఆత్మహత్యలా కనిపించేలా చేసేందుకు ఉరి వేసుకున్నట్లుగా చెట్టుకు వేలాడదీసినట్లు పోలీసులు చెప్పారు.
ఈ విషయాన్ని డుమ్కాడిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్పీ మండల్ తెలిపారు.
"హత్యకు గురైన బాలికకు నిందితునితో ముందే పరిచయం ఉన్నట్లు పోలీసులప్రాధమిక విచారణలో తేలింది.
ఆ అమ్మాయి నిందితుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు తెలిసింది. చాలా విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. మృతురాలి తల్లి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 302, 376, ఎస్ సీ, ఎస్ టీ చట్టం, పాక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశాం. ఆయనను విచారిస్తున్నాం" అని చెప్పారు.
"నా కూతురు ఒక కూలి పని చేసుకునే అమ్మాయి. ఆమెతో కలిసి పని చేసే అర్మాన్ అన్సారీ అనే ఒక తోటి కూలీ పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశారు. దీంతో, ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని అడగడంతో నా కూతురిని చంపేశారు" అని మృతురాలి తల్లి స్థానిక మీడియాతో చెప్పారు.
ఈ సంఘటన తర్వాత రాష్ట్రంలో రాజకీయ వాదనలు మొదలయ్యాయి.
ఈ అంశం పై ఝార్ఖండ్ ముఖ్య మంత్రి హేమంత్ సొరేన్, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసన సభ నాయకుడు బాబూ లాల్ మరాండీ కూడా ట్వీట్లు చేశారు.
"డుమ్కాలో చోటు చేసుకున్న సంఘటన చాలా విచారకరమైనది. నిందితుడిని అరెస్టు చేశారు. న్యాయం దొరికేందుకు చట్టాన్ని కఠినంగా అమలు చేయమని పోలీసులకు సూచించాను. మృతురాలి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో మృతురాలి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని అంటూ హేమంత్ సొరేన్ ట్వీట్ చేశారు.
"డుమ్కాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఘోరమైనది. అర్మాన్ అన్సారీ అనే వ్యక్తి గిరిజన అమ్మాయిని హత్య చేసి చెట్టుకు కట్టి హత్య చేసుకున్నట్లుగా వేలాడదీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అర్మాన్ ను అరెస్టు చేశారు. ఝార్ఖండ్లో ఇలాంటి దుర్మార్గుల చేతిలో మరెంత మంది గిరిజన బాలికలు బలవుతారో? అని బాబూ లాల్ మరాండీ ట్వీట్ చేశారు.
డుమ్కాలోనే కొన్ని రోజుల ముందు ఒక యువతిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ కేసులో కూడా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి ఛార్జ్ షీట్ తయారు చేస్తున్నారు.





