నేటి ముఖ్యాంశాలు
యువతకు దేశ సేవ చేసే అవకాశం కల్పించడానికి అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన వాళ్లను రెగ్యులర్గానే భావిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంలో రానున్న 15 నెలల్లో సుమారు 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఆయా శాఖలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించినట్లు పిఎంఓప్రకటించింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితుల ఆందోళన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులు, టీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.ఈ సందర్భంగా పలువురు మహిళలు గాయపడ్డారు. ఓ పోలీస్ అధికారి కిందపడిపోయారు.
దేశంలో రాళ్లదాడులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ అన్నారు. కొందరు దేశంలో అస్థిరతను వ్యాప్తి చేయాలని చూస్తున్నారని.. అందుకే దేశంలో చాలాచోట్ల ప్రణాళికాబద్ధంగా రాళ్లదాడులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నేడు కూడా ఈడీ ప్రశ్నించనుంది. సోమవారం సుమారు 11 గంటలపాటు ఆయనను ఈడీ విచారించింది.
మొహమ్మద్ ప్రవక్త మీద బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యూపీలో చేపట్టిన నిరసనలకు సంబంధించి ఇప్పటి వరకు 337 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయిన వాళ్లను రెగ్యులర్గానే భావిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో సంబంధం ఉందన్న ఆరోపణతో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంతటితో నేటి లైవ్ ముగిస్తున్నాం. అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింకు పై క్లిక్ చేయండి.











