సోనియా గాంధీ: ‘భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను అంతం చేయడమే బీజేపీ విధానం’

రాజకీయ ప్రత్యర్థులను బెదిరిస్తూ బీజేపీ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని సోనియా గాంధీ ఆరోపించారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. నేటి ముఖ్యాంశాలు

    • కరోనాతో ఒక వ్యక్తి మృతి చెందినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఆ దేశం కరోనా మరణాలను అధికారికంగా ప్రకటించడం ఇదే తొలిసారి.
    • కాకినాడలో గోపాల కృష్ణ అనే సబ్ ‌ఇన్‌స్పెక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌లో ఆయన పని చేస్తున్నారు.
    • జమ్మూ కశ్మీర్‌లో ముస్లింలను మైనారిటీలుగా మార్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని పాకిస్తాన్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఆరోపించారు.
    • ట్విటర్‌ను కొనుగోలు చేసే డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
    • కీయెవ్‌లోని భారత ఎంబసీ మే 17న తిరిగి తెరుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

  2. సోనియా గాంధీ: ‘భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను అంతం చేయడమే బీజేపీ విధానం’

    సోనియా గాంధీ

    ఫొటో సోర్స్, ANI

    రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ 'నవ్ సంకల్ప్ చింతన్ శివిర్'లో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మోదీతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    బీజేపీ మైనారిటీల పట్ల క్రూరంగా వ్యవహరిస్తూ, మహాత్మా గాంధీ హంతకులను కీర్తిస్తోందని ఆమె ఆరోపించారు.

    దేశాన్ని విభజించడం... ప్రజలను భయం, అభద్రతతో జీవించేలా చేయడం, మన సమాజంలో అంతర్భాగమైన మైనారిటీలను వేధించడం వారి లక్ష్యమని అన్నారు.

    రాజకీయ ప్రత్యర్థులను బెదిరిస్తూ బీజేపీ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆమె ఆరోపించారు.

    ప్రజలను విభజించడం, భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను అంతం చేయడమే బీజేపీ విధానమని అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. మీరు ఎన్నిరోజులకు ఒకసారి బెడ్‌షీట్లు, దుప్పట్లు మారుస్తారు/ఉతుకుతారు?

  4. యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ కన్నుమూత

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్

    ఫొటో సోర్స్, Getty Images

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని యూఏఈ ప్రభుత్వం ట్వీట్ ద్వారా తెలిపింది.

    అబుదాబి పాలకుడు కూడా అయిన షేక్ ఖలీఫా బిన్ జాయెద్ మృతి పట్ల అక్కడ 40 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.

    యూఏఈ రాజ్యాంగ ప్రకారం ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎమిరేట్స్ పాలకులు మరో 30 రోజుల్లో సమావేశమై కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

    ఆయన మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. నిత్యావసర సరకుల ధరలు ఇంకా పెరుగుతాయా? ఈ ధరల మంట చల్లారేదెప్పుడు?

  6. మే 17న తెరచుకోనున్న యుక్రెయిన్‌లోని భారత ఎంబసీ

    యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం

    ఫొటో సోర్స్, www.eoiukraine.gov.in

    రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా రెండు నెలలుగా మూసి ఉన్న కీయెవ్‌లోని భారత రాయబార కార్యాలయం మళ్లీ తెరుచుకోనుంది.

    కీయెవ్‌లోని భారత ఎంబసీ మే 17న తిరిగి తెరుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    యుద్ధం కారణంగా కీయెవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసేశారు. పోలాండ్ రాజధాని వార్సాలో దీన్ని తాత్కాలికంగా మార్చి 13న ఏర్పాటు చేశారు.

    ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించింది. దీంతో అనేక దేశాలకు చెందిన ప్రజలు యుక్రెయిన్‌లోనే చిక్కుకుపోయారు.

    యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ అనే కార్యక్రమాన్ని అమలు చేసింది. దీని తర్వాత యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని మూసి వేశారు.

  7. కురుక్షేత్ర: శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశంలో ముస్లింలు సమాధి నిర్మించారా? బీబీసీ పరిశోధనలో ఏం తెలిసిందంటే...

  8. బండి సంజయ్‌కు పరువు నష్టం నోటీసులు పంపిన కేటీఆర్

    తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌కి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు పరువు నష్టం నోటీసులు పంపించారు.

    ఈనెల 11వ తేదీన ట్విటర్‌లో కేటీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్‌కి ఆపాదించేలా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

    దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేటీఆర్... బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉంటే బయట పెట్టాలనిలేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిస్తూ తన న్యాయవాది చేత నోటీసులు పంపించారు.

    కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తుందనీ, దాంతో పాటు చట్ట ప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని న్యాయవాది తన నోటీసులో హెచ్చరించారు.

    48 గంటల్లో తన క్లయింట్ కేటీఆర్‌కి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో రాశారు.

    కేటీఆర్

    ఫొటో సోర్స్, TWITTER

  9. రాజపక్స సోదరులు: జనం దృష్టిలో యుద్ధ వీరులు అకస్మాత్తుగా విలన్లు ఎలా అయ్యారు?

  10. కాంగ్రెస్‌ పార్టీలో ‘ఒక కుటుంబానికి ఒకటే టికెట్’

    కాంగ్రెస్‌ పార్టీలో ‘ఒక కుటుంబానికి ఒకటే టికెట్’
  11. తాజ్ మహల్: ‘మూసి ఉన్న గదుల్లో దాగిఉన్న ఆ రహస్యాలు ఏంటంటే..’

  12. ఎలాన్ మస్క్: ‘ట్విటర్‌ డీల్‌ను తాత్కాలికంగా ఆపేస్తున్నా’

    ట్విటర్‌ను కొనుగోలు చేసే డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

    ట్విటర్‌లోని ఫేక్ అకౌంట్లుమొత్తం యూజర్లతో పోలిస్తే 5శాతం లోపు ఉన్నాయో లేదో తేలే వరకు ఈ డీల్ ఆపివేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు.

    ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు గత నెలలో ఎలాన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. శ్రీలంక కొత్త ప్రధాని: ‘ఓపికగా ఉండండి... పరిస్థితులు చక్క దిద్దుతా’

    శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే

    ఫొటో సోర్స్, UNP

    ఫొటో క్యాప్షన్, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే

    శ్రీలంక ఆర్థికవ్యవస్థ త్వరలోనే కోలుకుంటుందని, కాకపోతే అంతకు ముందు మరిన్ని కఠిన పరిస్థితులను చవి చూడాల్సి ఉంటుందని ఆ దేశ కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే అన్నారు.

    ప్రధాని అయిన తరువాత ఆయన తొలిసారి బీబీసీ ప్రతినిధి రజిని వైద్యనాథన్‌తో ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబం రోజుకు మూడు పూట్లా తినేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.

    తక్షణ సాయం కోసం భారత్, జపాన్ వంటి దేశాలతో మాట్లాడుతున్నట్లు తెలిపిన రణిల్ విక్రమసింఘే, శ్రీలంకలో తిండి దొరకని పరిస్థితి రాదని అన్నారు.

    ప్రజలు కాస్త ఓపికగా ఉంటే తాను పరిస్థితులను చక్కదిద్దుతానని విజ్ఞప్తి చేశారు.

  14. ‘చంద్రుని మట్టిలో తొలిసారి మొక్కలు మొలిచాయ్’

    చంద్రుని మట్టిలో మొలిచిన మొక్కలు

    ఫొటో సోర్స్, UF/IFAS

    శాస్త్రవేత్తలు చంద్రుని మట్టితో తొలిసారి మొక్కలు పెంచారు. 1969-72 మధ్య అపోలో మిషన్‌లో భాగంగా చంద్రుని మీదకు మనుషులు వెళ్లినప్పుడు చంద్రుని మీది రాళ్లు, మట్టిని నాడు భూమి మీదకు తీసుకొచ్చారు.

    ఫ్లోరిడా యూనివర్సిటీలో పరిశోధకులు చంద్రుని మట్టిలో విత్తనాలు నాటగా అవి మొలకెత్తాయి.

    ఇలా జరుగుతుందని తాము ఊహించలేదని, నాటిన అన్ని విత్తనాలు మొలకెత్తాయని ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన అనా లీసా పాల్ అన్నారు. అంటే మొక్కల పెరుగుదలను, వాటిలోని హార్మోన్స్‌ను చంద్రుని మట్టి అడ్డుకోవడం లేదనే విషయం తెలుస్తోందని తెలిపారు.

  15. గగన్‌యాన్ రాకెట్‌ను టెస్ట్ చేసిన ఇస్రో

    గగన్ యాన్ రాకెట్ టెస్టింగ్

    ఫొటో సోర్స్, ISRO

    అంతరిక్షంలోకి మానవులను తీసువెళ్లగల రాకెట్‌ను డెవలప్ చేస్తున్న ఇస్రో, దాన్ని పరీక్షించింది.

    హ్యూమన్ రేటెడ్ సాలిడ్ రాకెట్(HS200)‌కు సంబంధించిన స్టాటిక్ టెస్ట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేష్ సెంటర్‌లో ఈరోజు ఉదయం నిర్వహించారు. ఈ టెస్ట్ విజయవంతమైనట్లు ఇస్రో తెలిపింది.

    స్టాటిక్ టెస్టులో రాకెట్‌ను కదలకుండా బిగించి ఉంచి ఇంజిన్లను ఫైర్ చేస్తారు.

    గగన్‌యాన్ పేరిట 2023 నాటికి అంతరిక్షంలోకి భారతీయులను పంపాలని ఇస్రో భావిస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. హైదరాబాద్‌లో ఎర్రచందనం పట్టివేత

    తెలంగాణ పోలీసులు పట్టుకున్న ఎర్రచందనం దుంగలు

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.60 లక్షల విలువైన ఎర్రచందనాన్ని తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. దుంగల బరువు సుమారు 1,600 కేజీలు.

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరటిపండ్ల వ్యాపారులు ఈ పని చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అరటిపండ్ల వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు తీర్చడానికి డబ్బు కోసం ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.

    రాచకొండ పోలీసులు తెలిపిన ప్రకారం...

    కడప జిల్లాకు చెందిన షేక్ మహ్మద్ రఫీ అరటి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. కర్నూలుకు చెందిన ముల్లా బషీర్ అహ్మద్, హైదరాబాద్‌లో ఉంటున్నారు. రఫీ వద్ద అరటి పండ్లు కొనుగోలు చేసి తెలంగాణలో విక్రయిస్తుంటారు బషీర్.

    అరటి పండ్ల వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు తీర్చేందుకు ఎర్రచందనం దుంగలను తెలంగాణలో విక్రయించాలని నిర్ణయించుకున్నారు.

    కడప జిల్లాకు చెందిన మూర్తి అనే వ్యక్తి వారి వద్ద లక్ష రూపాయలు తీసుకొని సుమారు 1,500 కేజీల బరువు ఉండే 31 దుంగలను ఇచ్చారు.

    రఫీ, బషీర్ ఆ దుంగలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి మల్కాజ్‌గిరిలోని మౌలాలి దర్గా వద్ద ప్రభుత్వ స్థలంలో దాచారు.

    ఈమేరకు సమాచారం అందుకున్న ఎల్‌బీ నగర్ జోన్ పోలీసులు దాడి చేసి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

    పోలీసులు పట్టుకున్న ఎర్రచందనం

    ఫొటో సోర్స్, UGC

  17. శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే ముందున్న సవాళ్లేంటి?

  18. నటి కరాటే కల్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య ఘర్షణ

    కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి

    హైదరాబాద్‌లో సినీ నటి కరాటే కల్యాణి, ప్రాంక్‌లు చేసే యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

    ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    ప్రాంక్‌ల పేరుతో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా శ్రీకాంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కల్యాణి ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై నిలదీసేందుకు యూసుఫ్ గూడలోని శ్రీకాంత్ రెడ్డి ఇంటికి కల్యాణి వెళ్లారు.

    వీడియోలో కనిపిస్తున్న ప్రకారం... కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఆమె చిన్నారిని ఎత్తుకుని ఉన్నారు.

    ముందుగా కల్యాణినే శ్రీకాంత్ రెడ్డిని చెంప మీద కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఆ తరువాత మరొక వ్యక్తి వచ్చి శ్రీకాంత్ రెడ్డి మీద దాడి చేశారు.

    ఆ తరువాత శ్రీకాంత్ రెడ్డి తిరిగి కల్యాణిని కొట్టారు. ఈ ఘర్షణలో చిన్నారితో సహా ఆమె కింద పడ్డారు.

    అనంతరం వీధుల్లో ఇద్దరి మధ్య కొట్లాట, ఘర్షణ జరిగింది. శ్రీకాంత్ రెడ్డి చొక్కా చినిగిపోయి కనిపించింది.

    శ్రీకాంత్ రెడ్డిని చితక్కొట్టామంటూ మరొక వీడియోలో కల్యాణి చెబుతున్నారు. అయితే తనను కల్యాణి లక్ష రూపాయలు డిమాండ్ చేశారని, శ్రీకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

  19. మొక్కు తీర్చుకునేందుకు వచ్చే వారికి గుండు చేస్తున్న క్షురకురాలు

  20. కశ్మీర్ లోయలో కశ్మీరీ పండితుల ఆందోళన

    జమ్మూ కశ్మీర్‌లో ఒక కశ్మీరీ పండితున్ని హత్య చేయడంపై ఆ సముదాయం ఆందోళనకు దిగింది.

    బడ్గాంలోని చదూర తహశీల్ కార్యాలయంలో పని చేస్తున్న రాహుల్ భట్‌ను టెర్రరిస్టులు కాల్చిచంపారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    ఈ హత్యకు నిరసనగా కశ్మీరీ వ్యాలీలో కశ్మీరీ పండిట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిరసనకు దిగింది. తమకు రక్షణ కల్పించాలని లేదంటే సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని కశ్మీరీ పండితులు డిమాండ్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది