‘‘దమ్ముంటే తాజ్ మహల్, ఎర్ర కోటలను దేవాలయాలుగా మార్చి చూపించండి’’ – మెహబూబా ముఫ్తీ

‘‘మీకు దమ్ముంటే తాజ్‌ మహల్, ఎర్ర కోటలను దేవాలయాలుగా మార్చి చూపించండి. అప్పుడు భారత్‌కు ఎంత మంది విదేశీ పర్యటకులు వస్తారో చూడండి’’అని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.

లైవ్ కవరేజీ

  1. నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ అరెస్టు

    మాజీ మంత్రి నారాయణ

    ఫొటో సోర్స్, Facebook/Dr. Ponguru Narayana

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల యజమాని పొంగూరు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ఈరోజు ఉదయం హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకున్నారు.

    కొంతకాలంగా ఏపీలో పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. ఆ కేసులోనే నారాయణను అదుపులోకి తీసుకున్నట్టు ప్రాథమిక సమాచారం.

    ఆయనను చిత్తూరుకు తరలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

  2. ఈ ఆటోలో ఎక్కితే చెట్ల మధ్య కూర్చున్న ఫీలింగ్ వస్తుంది

    తిరుపతిలోని ఒక ఆటో డ్రైవర్ పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ తన ఆటోతో ప్రచారం చేస్తున్నారు. స్కూలు పిల్లలను, గర్భిణులను, వృద్ధులను ఆటోలో ఉచితంగా గమ్యానికి కూడా చేరుస్తున్నారు.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  3. ఎండలు పెరగడంతో మండిపోతున్న గోదుమ పిండి ధర

  4. ‘సింగపూర్‌లో కశ్మీర్ ఫైల్స్ సినిమా నిషేధం’

    కశ్మీర్ ఫైల్స్ చిత్రం పోస్టర్

    ఫొటో సోర్స్, ANI

    కశ్మీర్ పండితుల మీద తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాను సింగపూర్‌ నిషేధించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

    ‘కశ్మీర్ ఫైల్స్ సినిమా రెచ్చగొట్టేలా ఉంది. కశ్మీర్‌లో హిందువులపై జరిగిన దాడులను, అందులో ముస్లింల పాత్రను చిత్రీకరించడంలో ఏకపక్షంగా వ్యవహరించారు.’ అంటూ సింగపూర్ అధికారులు తెలిపినట్లు హిందుస్థాన్ టైమ్స్ రాసింది.

    కశ్మీర్ ఫైల్స్‌ సినిమాను సింగపూర్ బ్యాన్ చేయడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన శశి థరూర్ స్పందించారు.

    బీజేపీ పార్టీ ప్రమోట్ చేసిన కశ్మీర్ ఫైల్స్‌ను సింగపూర్‌లో బ్యాన్ చేశారంటూ ఆయన ట్వీట్ చేశారు.

    అయితే శశి థరూర్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. కశ్మీరీ హిందువుల ఊచకోత మీద శశిథరూర్ స్పందన చాలా దారుణంగా ఉందని విమర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. అసాని తుపాను: ఉత్తరాంధ్రలో వానలు... విశాఖకు రావల్సిన 10 విమానాలు రద్దు

  6. శ్రీలంక హింస: ఎంపీల ఇళ్లకు నిప్పు

    శ్రీలంకలో కాలిపోతున్న ఇళ్లు

    ఫొటో సోర్స్, Reuters

    శ్రీలంకలో పరిస్థితులు హింసాత్మకంగా మారుతున్నాయి. సోమవారం మొదలైన హింసలో ఇప్పటి వరకు అయిదుగురు చనిపోగా 190 మందికిపైగా గాయపడ్డారు.

    శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్ష మద్దతుదారులు దాడి చేయడంతో నిరసనకారుల్లో కోపం కట్టలు తెంచుకుంది. దాంతో రాజపక్ష కుటుంబానికి చెందిన ఇళ్లతో పాటు ఎంపీల ఇళ్లకు వారు నిప్పు అంటించారు.

    ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో అధ్యక్షుడు గోటబయ రాజపక్ష దిగి పోవాలంటూ అక్కడి ప్రజలు కొద్ది నెలలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

    శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారుల మీద ప్రభుత్వ మద్దతుదారులు సోమవారం దాడి చేశారు.

  7. ‘ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి టెర్రరిస్ట్ కుట్ర కూడా అయి ఉండొచ్చు’- పంజాబ్ పోలీసులు

    ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి టెర్రరిస్ట్ కుట్ర కూడా అయి ఉండొచ్చు- పంజాబ్ పోలీసులు

    పంజాబ్ ఇంటెలిజెన్స్ హెడ్ ఆఫీసుపై జరిగిన దాడి వెనుక టెర్రరిస్టుల కుట్ర కూడా ఉండొచ్చని, ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు మొహాలీ ఎస్పీ రవీందర్ పాల్ సింగ్ తెలిపారు.

    మొహాలీలోని పంజాబ్ పోలిస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై సోమవారం రాత్రి దాడి జరిగింది. రాకెట్ వంటి వెపన్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

    ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. ఫిలిప్పీన్స్ అధ్యక్షునిగా ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్

    ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్

    ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఫిలిప్పీన్స్ అధ్యక్షునిగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    మాజీ నియంత ఫెర్డినాండ్ మార్కోస్ సీనియర్ కుమారుడే మార్కోస్ జూనియర్.

    ప్రాథమిక ఫలితాల ప్రకారం భారీ మెజారిటీతో ఫెర్డినాండ్ గెలుస్తున్నట్లుగా సీఎన్‌ఎన్ రిపోర్ట్ చేసింది.

    ఈ ఎన్నికల్లో ఫెర్డినాండ్ గెలిస్తే 36 ఏళ్ల తరువాత మార్కోస్ కుటుంబం మళ్లీ అధికారం చేపట్టినట్లు అవుతుంది.

    అనధికారిక డేటా ప్రకారం ఫెర్డినాండ్ మాక్రోస్‌కు సుమారు 3 కోట్ల ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి లెని రాబ్రెడోకు 1.4 కోట్ల ఓట్లు వచ్చినట్లు సీఎన్‌సీఎన్ ఫిలిప్పిన్స్ తెలిపింది.

    పూర్తి స్థాయిలో అధికారిక ఫలితాలను వెల్లడించడానికి సుమారు వారం పడుతుంది.

  9. పోర్న్ వీడియోలను కొందరు పబ్లిగ్గా ఎందుకు చూస్తారు?

  10. జహీరాబాద్ శివార్లలో ట్రాలీ ఆటోను డీకొట్టిన ట్రావెల్ బస్సు.. వ్యక్తి సజీవ దహనం

    జహీరాబాద్ ప్రమాదం

    హైదరాబాద్ నుంచి లాతూర్ వెళ్తున్న ట్రాలీ ఆటోను ముంబయి నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు వేగంగా డీకొట్టడంతో తీవ్ర ప్రమాదం సంభవించింది.

    ఈ ప్రమాదంలో పూర్తిగా బోల్తా కొట్టిన ట్రాలీ ఆటో మంటల్లో చిక్కుకుంది. సమీర్ అనే వ్యక్తి పూర్తిగా మంటల్లో కాలిపోయి చనిపోయారని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపారు.

    గాయపడిన డ్రైవర్ సిద్దిఖ్ కుమార్ సింగ్, షేక్ ఇమామ్, సలీంలను జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. సమీర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఇన్‌స్పెక్టర్ తోట భూపతి చెప్పారు.

    ట్రావెల్ బస్సు వేగంగా వచ్చి డీకొనడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయిందని చెప్పిన పోలీసు అధికారి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

    ఈ ప్రమాదం వేకువ జామున 4.30 ప్రాంతంలో జరిగింది.

  11. ‘‘దమ్ముంటే తాజ్ మహల్, ఎర్ర కోటలను దేవాలయాలుగా మార్చి చూపించండి’’ – మెహబూబా ముఫ్తీ