మరో రూ. 100 పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్.. మూడు నెలల్లో రూ. 450 పైనే పెరిగిన ధర
కమర్షియల్ ఎల్పీజీ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం ఆదివారం నాడు రూ. 102.50 మేర పెంచింది. దీంతో ఈ సిలిండర్ ధర రూ. 2,253 నుంచి రూ. 2,355.50 కు పెరిగింది.
ఐదు కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 655కు పెరిగింది.
ఇంతకుముందు ఏప్రిల్ 1వ తేదీన 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం రూ. 250 పెంచింది. దానికిముందు మార్చి 1వ తేదీన కూడా ఈ సిలిండర్ ధరను రూ. 105 పెంచింది.
ఇదిలావుంటే.. ఉజ్వల దివస్ ఉత్సవాల కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ తదితర చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం నాడు దేశవ్యాప్తంగా 5,000 ఎల్పీజీ పంచాయతీలు నిర్వహించనున్నాయి.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న ప్రతి కుటుంబానికీ ఒక ఉచిత ఎల్పీజీ కనెక్షన్ అందిస్తారు.