చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి రవీంద్ర జడేజా గుడ్ బై... మళ్లీ ధోనీకే పగ్గాలు

రవీంద్ర జడేజా శనివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో, మహేంద్ర సింగ్ ధోనీ మరొకసారి ఈ జట్టుకు మరోసారి నాయకత్వం వహించబోతున్నాడు. ఐపీఎల్ పోటీలలో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న సమయంలో రవీంద్ర జడేజా ఈ నిర్ణయం తీసుకున్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. నేటి ముఖ్య పరిణామాలు

    • అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో శుక్రవారం ఒక మసీదు వద్ద సంభవించిన భారీ పేలుడులో 50 మంది చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
    • యుక్రెయిన్‌లో బుచా, మరియుపోల్, ఇతర ప్రాంతాల్లో రష్యా అకృత్యాలకు పాల్పడ్డప్పటికీ.. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడటానికి తాను సిద్ధంగానే ఉన్నానని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ చెప్పారు.
    • బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ. 7.27 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.
    • తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్లాటెడ్ సర్వదర్శనం పునరుద్ధరించి త్వరలో భక్తులకు టైంస్లాట్ టోకెన్లు కేటాయించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
    • భారత సైన్యం కొత్త చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు.
    • రవీంద్ర జడేజా శనివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో, మహేంద్ర సింగ్ ధోనీ మరొకసారి ఈ జట్టుకు మరోసారి నాయకత్వం వహించబోతున్నాడు.

    ఇవాల్టికి బీబీసీ తెలుగు న్యూస్ లైవ్ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  2. విశాఖపట్నం మత్స్యకారుల జీవితంలో ఒకరోజు - 'ఒక్కోసారి వేటకు వెళ్తే తిరిగి రావడం కష్టమే'

  3. వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి ఎవరు, ఎందుకు చేశారు

  4. రష్యా విక్టరీ డే అంటే ఏంటి, మే 9వ తేదీ ఆ దేశానికి ఎందుకంత ముఖ్యం?

  5. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి రవీంద్ర జడేజా గుడ్ బై, మళ్లీ ధోనీకే పగ్గాలు

    రవీంద్ర జడేజా

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, రవీంద్ర జడేజా

    రవీంద్ర జడేజా శనివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో, మహేంద్ర సింగ్ ధోనీ మరొకసారి ఈ జట్టుకు మరోసారి నాయకత్వం వహించబోతున్నాడు.

    ఐపీఎల్ పోటీలలో చెన్నై సూపర్ కింగ్స్ వైఫల్యాలు ఎదుర్కొంటున్న సమయంలో రవీంద్ర జడేజా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచుల్లో ఈ జట్టు 6 మ్యాచులలో ఓడిపోయింది.

    కెప్టెన్సీ మూలంగా రవీంద్ర జడేజా వ్యక్తిగత ఆట తీరు కూడా దెబ్బతిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత 8 మ్యాచుల్లో కలిపి జడేజా వ్యక్తిగత స్కోర్ 112 పరుగులు మాత్రమే. ఆయన తీసిన వికెట్లు కూడా అయిదే. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. రాహుల్ తేవటియా, మిల్లర్ అజేయ భాగస్వామ్యం... గుజరాత్ టైటాన్స్ గెలుపు

    గుజరాత్ టైటాన్స్

    ఫొటో సోర్స్, BCCI/IPL

    రాహుల్ తేవటియా, డేవిడ్ మిల్లర్ 40 బంతుల్లోనే అజేయంగా 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో శనివారం రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 6 వికెట్లతో విజయాన్ని సాధించింది.

    ఈ సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌కు ఇది ఎనిమిదో విజయం. దీంతో 16 పాయింట్లతో ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.

    బెంగళూరు విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ జట్టు చేధించింది.

    డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తేవటియా (25 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడటంతో 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది.

    సాహా (29), గిల్ (31), సాయి సుదర్శన్ (20) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ చెరో 2 వికెట్లు తీశారు.

    అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది.

  7. బెడ్‌షీట్లను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి?

  8. అంబేడ్కర్‌ గురించి పశ్చిమ దేశాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయి?

  9. IPL: ఈ సీజన్‌లో కోహ్లి తొలి అర్ధసెంచరీ, ఆర్సీబీ 170/6

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి తొలి అర్ధసెంచరీని నమోదు చేశాడు.

    శనివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి 53 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 58 పరుగులు చేశాడు. రజత్ పటిదార్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా వేగంగా హాఫ్ సెంచరీ సాధించాడు.

    దీంతో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్నీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ డకౌట్ అయ్యాడు.

    ప్రత్యర్థి బౌలర్లలో ప్రదీప్ సాంగ్వాన్ 2 వికెట్లు పడగొట్టాడు. షమీ, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్ తలా ఓ వికెట్ తీశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. 58 ఏళ్ల వయసులోపదో తరగతి పరీక్షలు రాసిన ఎమ్మెల్యే

    ఎమ్మెల్యే అంగద కన్హర్

    ఫొటో సోర్స్, ANI

    ఒడిశాకు చెందిన ఓ 58 ఏళ్ల ఎమ్మెల్యే తాజాగా పదో తరగతి పరీక్షలు రాశారు.

    ఫూల్బని నియోజకవర్గం ఎమ్మెల్యే (బిజూ జనతా దళ్) అంగద కన్హర్.. 1978లో కుటుంబ కారణాల రీత్యా చదువు మానేశారు.

    ఒడిశాలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈ) పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అంగద కన్హర్ అదే రోజు మొదటి పేపర్ పరీక్ష రాశారు.

    ఆయన తన ఇద్దరు మిత్రులతో కలిసి రుజాంగి హైస్కూలులో పరీక్షలకు హాజరవటం కనిపించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    పరీక్ష రాయటానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘1978లో నేను పదో తరగతి చదువుతుండే వాడిని. కానీ కుటుంబ కారణాల రీత్యా పరీక్షలకు హాజరుకాలేకపోయాను. చాలా మంది 50 ఏళ్లు దాటాక కూడా ఈ పరీక్షలు రాస్తున్నారని ఇటీవల నాకు తెలిసింది. కాబట్టి నేను కూడా ఈ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నా’’ అని చెప్పారు.

    ‘‘చదువుకోవటానికి, పరీక్షలు రాయటానికి వయసు అడ్డంకి కాదు’’ అని పేర్కొన్నారు.

    ఈ ఎమ్మెల్యేతో పాటు ఆయన మిత్రుడైన ఒక సర్పంచి కూడా పదో తరగతి పరీక్షలు రాయటం విశేషం.

  11. బ్యాడ్మింటన్ ఏసియా చాంపియన్‌షిప్‌ సెమీ ఫైనల్‌లో సింధు ఓటమి.. కాంస్యంతో సరి

    పి.వి.సింధు

    ఫొటో సోర్స్, Badminton Association of India

    మనీలాలో జరుగుతున్న బ్యాండ్మింటన్ ఏసియా చాంపియన్‌షిప్ 2022 ఉమెన్స్ సింగిల్స్‌లో భారత షట్లర్ పి.వి.సింధు కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.

    శనివారం జరిగిన సెమీ ఫైన్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ అకాని యమగుచి చేతిలో సింధు ఓటమి పాలయ్యారు.

    గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ 2 అయిన యమగుచి.. మాజీ ప్రపంచ చాంపియన్ సింధును 13-21, 21-19, 16-21 స్కోర్లతో ఓడించారు.

    పి.వి.సింధుకు ఆసియా చాంచిపయన్‌షిప్‌లో ఇది రెండో కాంస్య పతకం.

  12. భారత కొత్త సేనాధిపతిగా జనరల్ మనోజ్ పాండే బాధ్యతల స్వీకరణ

    జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే, జనరల్ మనోజ్ పాండే

    ఫొటో సోర్స్, ANI

    భారత సైన్యం కొత్త చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే శనివారం నాడు బాధ్యతలు స్వీకరించారు.

    ఇంజనీరింగ్ కోర్ నుంచి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ పదవి చేపట్టిన తొలి అధికారి ఆయన.

    దిల్లీలోని సౌత్ బ్లాక్‌లో శనివారం పదవీ విరమణ చేస్తున్న జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే నుంచి మనోజ్ పాండే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బాధ్యతలు స్వీకరించారు.

    భారత సైన్యంలోని 117 ఇంజనీర్స్ రెజిమెంట్‌కు చెందిన జనరల్ పాండే 29వ భారత సేనాధిపతి అవుతారు. 1982 డిసెంబర్ 24న ఆయన భారత సైన్యపు కోర్ ఆఫ్ ఇంజనీర్స్‌లో చేరారు.

    ఆయన కుమారుడు కూడా భారత వైమానిక దళంలో రవాణా విమాన విభాగంలో పైలట్‌గా పనిచేస్తున్నారు.

  13. జస్టిస్ ఎన్.వి. రమణ: 'పాలన చట్టబద్ధంగా సాగితే, పోలీసులు పారదర్శకంగా ఉంటే ప్రజలు కోర్టులకు రావాల్సిన అవసరమే ఉండదు'

  14. తిరుమలలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు పునరుద్ధరణ.. 5వ తేదీ నుంచి మెట్టు మార్గం పునఃప్రారంభం: టీటీడీ బోర్డు నిర్ణయాలు

    తిరుమల

    ఫొటో సోర్స్, @TTDevasthanams

    తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్లాటెడ్ సర్వదర్శనం పునరుద్ధరించి త్వరలో భక్తులకు టైంస్లాట్ టోకెన్లు కేటాయించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది.

    టోకెన్లు లేని భక్తులకు యధావిధిగా దర్శనానికి అనుమతి కొనసాగించాలని, నడకదారి భక్తులకు కూడా మునుపటిలా దివ్యదర్శనం టోకెన్లు కేటాయించాలని నిర్ణయించింది.

    మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీకి 500 కోట్ల రూపాయలు విలువ చేసే 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది.

    ‘‘ఆ స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రేమండ్ సంస్థ అధినేత గౌతమ్ సింఘానియా రూ. 60 కోట్లు వరకు విరాళమిచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలో ముంబైలో ఆలయం‌ నిర్మాణానికి‌ శంఖుస్థాపన చేస్తాం’’ అని టీటీడీ బోర్డు చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

    వై.వి.సుబ్బారెడ్డి

    ఫొటో సోర్స్, @TTDevasthanams

    శ్రీవారి మెట్టు మార్గంలో మరమ్మత్తులు పూర్తి చేశామని.. మే 5 వ తేదీ నుండి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తామని ఆయన తెలిపారు.

    అలాగే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో మరమ్మత్తులు, పటిష్టం చేయడానికి రూ. 20 కోట్లు నిధులు కేటాయించినట్లు చెప్పారు. తిరుమలలో గదులు మరమ్మమత్తుల కోసం మరో రూ. 19 కోట్లు నిధులు మంజూరు చేశామన్నారు.

    తిరుమలలో ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ కోసం2.86 ఎకరాలు స్థలం ఆర్టీసీకి కేటాయిస్తున్నట్లు చెప్పారు.

    మే 5 వ తేదీ 240 కోట్లతో శ్రీపద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని సుబ్బారెడ్డి తెలిపారు. టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు.

    తిరుమలకు మూడోమార్గం నిర్మాణానికి అనుమతులు ఇంకా రాలేదని, అనుమతులు వచ్చాక మామండూరు మీదుగా మెట్లమార్గం నిర్మిస్తామని వివరించారు.

  15. పటియాలా ఘర్షణ: ఇంటర్నెట్ బంద్.. ముగ్గురు పోలీస్ అధికారుల బదిలీ

    పటియాలాలో ఉద్రిక్తత

    ఫొటో సోర్స్, ANI

    పంజాబ్‌లోని పటియాలాలో శుక్రవారం నాడు శివసేన, అతివాద సిక్కు బృందాలకు మధ్య ఘర్షణతో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం శనివారం కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇంటర్నెట్‌ను ప్రభుత్వ యంత్రాంగం నిలిపివేసింది.

    శనివారం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకూ ఇంటర్నెట్ సేవలను నిలిచిపోతాయి. అయితే వాయిస్ సర్వీసులు పనిచేస్తాయి.

    ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ ఉత్తర్వులతో పటియాలా ఐజీ, ఎస్ఎస్‌పీ, ఎస్‌పీలను బదిలీ చేశారు. కొత్త ఐజీగా ముఖ్వీందర్ చినాను నియమించారు.

    నగరంలో శాంతి సంఘాల సమావేశాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    భారతదేశంలో నిషిద్ధ సంస్థ అయిన సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు చెందిన గురుపత్వంత్ సింగ్ పన్ను.. ఏప్రిల్ 29వ తేదీన డీసీ కార్యాలయాల వద్ద ఖలిస్తాన్ పతాకాన్ని ఎగురవేస్తామని ప్రకటించారు. దీనిని హిందూ సంస్థలు వ్యతిరేకిస్తూ ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి.

    కొన్ని సిక్కు సంస్థలు వీరి ప్రదర్శనలను నిరసించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు పటియాలాలో ఇరువర్గాలు రాళ్లు విసురుకోవటంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    పటియాలా జిల్లాలో 144 సెక్షన్ విధించి.. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకూ కర్ఫ్యూ అమలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

    కొన్ని అసాంఘిక శక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం నగరంలో శాంతిని దెబ్బతీస్తున్నాయని పటియాలా ఎమ్మెల్యే అజిత్‌పాల్ కోహ్లీ బీబీసీ ప్రతినిధి మన్‌ప్రీత్ కౌర్‌తో చెప్పారు.

    మరోవైపు హిందూ సంస్థలు శనివారం నగర బంద్‌కు పిలపునిచ్చాయి. శనివారం ఉదయం తాము మూడు గంటల పాటు నిరసన నిర్వహించామని కాళీమాతా మందిర్ ప్రధాన పూజారి పటియాలా పంచనందన్ గిరి చెప్పారు.

    పటియాలాలో ఉద్రిక్తత

    ఫొటో సోర్స్, ANI

  16. పోర్న్ వీడియోలను పార్లమెంటులో చూశారని బ్రిటన్ ఎంపీ నీల్ పరీశ్‌పై ఆరోపణలు... అసలేమిటీ వివాదం

  17. జమ్మూకశ్మీర్ భద్రత కోసం రెండేళ్లలో రూ. 9,120 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం

    జమ్మూ కశ్మీర్

    ఫొటో సోర్స్, Getty Images

    జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసినప్పటి నుంచీ 2021 వరకూ.. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 9,000 కోట్లు ఖర్చు చేసింది.

    కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్, లదాఖ్‌లుగా విభజించిన తర్వాత 24 నెలలలో భద్రత సంబంధిత వ్యయం (పోలీస్) పథకం కింద ఈ మొత్తాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి అందించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.

    కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇటీవల ప్రచురించిన 2020-2021 వార్షిక నివేదికలో ఈ వాస్తవాలు ఉన్నట్లు తెలిపింది.

    ‘‘జమ్మూకశ్మీర్‌ను విభజించినప్పటి నుంచీ భద్రతా సదుపాయాలను బలోపేతం చేయటం కోసం భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి రూ. 9,120.69 కోట్లు అందించింది’’ అని ఆ నివేదికలో వెల్లడించారు.

  18. కాన్సాస్ రాష్ట్రంలో టోర్నడో విధ్వంసం

    వీడియో క్యాప్షన్, అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో ఆండోవర్ వద్ద టోర్నడో విధ్వంస దృశ్యాలు

    అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో శనివారం నాడు ఓ భారీ టోర్నడో (సుడిగాలి) పెను విధ్వంసం సృష్టించింది.

    ఈ దృశ్యాలను కొందరు వీడియో తీశారు. కార్లు భవనాల్లోకి కూరుకుపోవటం, భవనాలు పైకప్పులు లేచిపోవటం ఆ వీడియోల్లో కనిపిస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    విచిటా నగరంలో 50 నుంచి 100 నిర్మాణాలు ధ్వంసమయ్యాయని మేయర్ తెలిపారు.

    అయితే ప్రజలకు తీవ్ర గాయాలైనట్లు వార్తలేమీ రాలేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    కరెంటు తీగలు తెగిపడటం, భారీ ఎత్తున పోగుపడిన శిథిలాలు రోడ్లకు అడ్డంకులుగా మారాయని ఆండోవర్ సిటీ పోలీస్ విభాగం చెప్పింది.

    ప్రజలెవరూ ప్రయాణాలు పెట్టుకోవద్దని విచిట మేయర్ డాక్టర్ బ్రాండన్ విపిల్ సూచించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  19. జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఆస్తులు రూ. 7.27 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

    జాక్విలిన్ ఫెర్నాండెజ్ (ఫైల్ ఫొటో)

    ఫొటో సోర్స్, ANI

    బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ. 7.27 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.

    ఏఎన్ఐ కథనం ప్రకారం.. జైలులో ఉన్న సుకేశ్ చక్రవర్త పాత్రధారిగా గల ఓ మనీ లాండరింగ్ కేసులో.. జాక్విలిన్‌కు చెందిన ఈ మొత్తం ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఈడీ అటాచ్‌ చేసింది.

  20. భర్తను చంటి పిల్లాడిలా కాపాడుకుంటున్న మహిళ కథ..