పాకిస్తాన్లోని
కాలేజీల్లో కానీ, ఇతర విద్యా సంస్థల్లో కానీ చేరవద్దని భారతీయ విద్యార్థులను యూనివర్సిటీ
గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్
(ఏఐసీటీఈ) హెచ్చరించాయి.
పాక్ కాలేజీలు,
విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు భారతదేశంలో ఉద్యోగం కానీ, ఉన్నత విద్య కానీ
లభించదని చెప్పింది.
భారత
విద్యార్థులు ఉన్నత చదువుల కోసం చైనా విద్యా సంస్థల్లో చేరవద్దంటూ నెల రోజుల కిందట
హెచ్చరించారు.
పీటీఐ వార్తా
సంస్థ కథనం ప్రకారం.. ‘‘భారతీయ విద్యార్థులందరికీ ఉన్నత విద్య కోసం పాకిస్తాన్
వెళ్లరాదని సలహా ఇస్తున్నాం. భారతజాతీయులు ఎవరైనా, భారతజాతీయత మూలాలున్న
విదేశీజాతీయులు ఎవరైనా పాకిస్తాన్లోని ఏ కాలేజీ లేదా విద్యా సంస్థలో
చేరాలనుకుంటే.. వారు పాకిస్తాన్ సర్టిఫికెట్ల ప్రాతిపదికన భారతదేశంలో ఉద్యోగం
కానీ, ఉన్నత విద్య కానీ పొందలేరు’’ అని యూజీసీ, ఏఐసీటీఈలు జారీచేసిన హెచ్చరిక చెప్తోంది.
అయితే.. ‘‘పాకిస్తాన్లో చదువుకుని వలసవచ్చిన పౌరులు, వారి పిల్లలు భారత పౌరసత్వం ఉన్నట్లయితే వారు హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ పొంది భారతదేశంలో ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు’’ అని పేర్కొంది.
ఇటువంటి హెచ్చరిక జారీ చేయటానికి గల కారణాలకు సంబంధించి సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదని పీటీఐ తెలిపింది.