‘రష్యాపై భారీ యుద్ధానికి యుక్రెయిన్ సిద్ధంగా ఉంది’

యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరిగే కంటే ముందే తూర్పున దోన్బస్ ప్రాంతంలోని రష్యా దళాలపై కచ్చితంగా గెలుపొందాలని ఆయన అన్నారు.

లైవ్ కవరేజీ

వరికూటి రామకృష్ణ

  1. 2021-22లో మూడు రెట్లు పెరిగిన విద్యుత్ వాహనాల అమ్మకాలు

    టాటా టిగోర్ ఎలక్ట్రిక్ వాహనం

    ఫొటో సోర్స్, tigorev.tatamotors.com

    భారత్‌లో విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా(ఫాడా) తెలిపింది.

    2021-22లో విద్యుత్ వాహనాల అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని, వీటిలో టూ వీలర్ల సేల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది.

    2021-22లో 4,29,217 వాహనాలు అమ్ముడు పోయాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం అంటే 2020-21లో అమ్ముడు పోయిన వాహనాల సంఖ్య 1,34,821.

    ప్యాసింజర్ విభాగంలో 15,198 వాహనాలతో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 85.37శాతంగా ఉంది.

    2,045 వాహనాలతో రెండో స్థానంలో ఉన్న ఎంజీ మోటార్ ఇండియా 11.49శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.

    ఇక టూ వీలర్స్ విషయంలో 65,303 వాహనాలతో హీరో ఎలక్ట్రిక్ టాప్‌లో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న ఒకినావా ఆటోటెక్ 46,447 వాహనాలను విక్రయించింది.

    హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్స్

    ఫొటో సోర్స్, Facebook/Hero Electric

  2. శివసేన భవనం వద్ద లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా... అడ్డుకున్న పోలీసులు

    శివ సేన కార్యాలయం

    ఫొటో సోర్స్, ANI

    శ్రీరామనవమి సందర్భంగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కార్యకర్తలు ముంబయిలోని శివసేన కార్యాలయం ఎదుట స్పీకర్లు పెట్టి హనుమాన్ చాలీసా ప్లే చేశారు.

    శివసేన పార్టీ కార్యాలయం ‘శివసేన భవన్’ ముందు లౌడ్ స్పీకర్లున్న వాహనంలో హనుమాన్ చాలీసా, భక్తి గీతాలు వినిపించడం ప్రారంభించారు.

    ఇంతలో ముంబయి పోలీసులు వచ్చి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కార్యకర్తలను అడ్డుకున్నారు. కొందరు కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.

    మహారాష్ట్రలో మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లు తొలగించాలంటూ కొద్ది రోజులుగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఇమ్రాన్ ఖాన్: పాకిస్తాన్ ప్రధాన మంత్రి పతనానికి కారణం ఏమిటి

  4. ఇమ్రాన్ ఖాన్: మేటి క్రికెటర్ నుంచి ప్రధాని వరకు.. పదవీచ్యుత నేత ప్రస్థానం ఇది

    వీడియో క్యాప్షన్, ఇమ్రాన్ ఖాన్: మేటి క్రికెటర్ నుంచి పదవీచ్యుత ప్రధాని వరకు.. పదవీచ్యుత నేత ప్రస్థానం ఇది

    గత మార్చిలో పాకిస్తాన్‌లో వరుస పరిణామాల నడుమ పార్లమెంటులో ఆయన ఆధిక్యాన్ని కోల్పోయారు. తన పార్టీ పాకిస్తాన్ తహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన కొందరు సభ్యులపై అనర్హత వేటుతోపాటు కొన్ని పార్టీలు తమ కూటమి నుంచి వెళ్లిపోవడంతో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు అవసరమైన ఆధిక్యం కోల్పోయారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గలేకపోయారు.

  5. లెబనాన్ ఆర్థిక సంక్షోభం: ఖైదీల కడుపు నింపలేని దుస్ధితి

    లెబనాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ ప్రభావం ఆ దేశపు జైళ్లపైనా కనిపిస్తోంది. జైల్లో అందిస్తున్న ఆహారం వారికి సరిపోవడం లేదు. నాణ్యత గురించి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. లెబనాన్‌లోని అతి పెద్ద జైలు నుంచి బీబీసీ అందిస్తున్న కథనం.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  6. తెలంగాణ ధాన్యం కొనుగోలు: రేపు దిల్లీలో టీఆర్‌ఎస్ నిరసన దీక్ష

    తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన నిరసన ఫ్లెక్సీలు

    ఫొటో సోర్స్, ANI

    తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ రేపు దిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ నిరసన దీక్ష చేపడుతోంది.

    ఈమేరకు దీక్షకు సంబంధించి తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లను కల్వకుంట్ల కవిత, ఇతర టీఆర్‌ఎస్ నేతలు సమీక్షించారు.

    తెలంగాణ వరి ధాన్యాన్ని కొనడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసన దీక్షలు చేపట్టింది.

    రేపు దిల్లీలో జరగనున్న దీక్షలో టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొననున్నారు.

  7. ఇమ్రాన్ ఖాన్: ప్లేబాయ్ క్రికెటర్ ప్రధానిగా ఎలా ఎదిగారు, అదే పదవికి ఇప్పుడు ఎలా దూరమయ్యారు?

    2018లో ప్రధాని పదవిని చేపట్టిన ఇమ్రాన్‌ఖాన్, ఆ దేశ చరిత్రలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన తొలి ప్రధానిగా మిగిలిపోయారు. పాకిస్తాన్ మేటి క్రికెటర్‌గా, ప్లేబాయ్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్‌ఖాన్ ప్రస్థానం ఇలా సాగింది.

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  8. గుజరాత్: భారత్, పాకిస్తాన్ సరిహద్దులో వ్యూ పాయింట్ ప్రారంభించిన అమిత్ షా

    గుజరాత్‌లో ఏర్పాటు చేసిన భారత్, పాకిస్తాన్ సరిహద్దు వ్యూ పాయింట్

    ఫొటో సోర్స్, ANI

    గుజరాత్‌లో భారత్, పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు.

    పంజాబ్‌లోని వాఘా-అట్టారీ సరిహద్దు మాదిరిగానే గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలోగల నడా బెట్ వద్ద వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు.

    భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే భారత సైనిక శిబిరాలను ఈ వ్యూ పాయింట్ ద్వారా చూడొచ్చని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.

    తుపాకులు, యుద్ధట్యాంకుల వంటి సైనిక ఆయుధసామాగ్రికి సంబంధించిన ఫొటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

  9. 53 ఏళ్ల వృద్ధురాలిని 23 ఏళ్ల యువతిగా మార్చే చర్మ చికిత్స

  10. శ్రీలంకలో సామాన్యులకు అందని బియ్యం

    శ్రీలంకలో సరుకుల సంచితో మహిళ

    ఫొటో సోర్స్, Getty Images

    పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకు పోయిన శ్రీలంకలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బియ్యం సామాన్య ప్రజలకు అందకుండా పోతోంది.

    కిలో బియ్యం ధర శ్రీలంక కరెన్సీలో రూ.200-240కు చేరినట్లు స్థానిక మీడియా సంస్థ కొలంబో పేజ్ వెల్లడించింది.

    ఆర్థిక కష్టాల వల్ల బియ్యం, పాల పొడి వంటి వాటిని దిగుమతి చేసుకోవడం చాలా వరకు శ్రీలంక నిలిపివేసింది. దీంతో డిమాండ్‌కు తగిన సరఫరా లేక ధరలు పెరిగిపోతున్నాయి.

    కష్టాల్లో ఉన్న శ్రీలంకను ఆదుకునేందుకు బియ్యం, పెట్రోలు వంటివి భారత్ పంపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పోర్టు నుంచి బియ్యంతో ఓడలు బయలు దేరుతున్నాయి.

  11. బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివాదం ఎందుకు

  12. కేటీఆర్: ‘హిందీని బలవంతంగా రుద్దకండి... ప్రజలు ఏం మాట్లాడాలో వారినే నిర్ణయించుకోనివ్వండి’

    దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లిష్‌లో కాకుండా హిందీలో మాట్లాడాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.

    భిన్నత్వంలో ఏకత్వం అనేది మన బలం అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్, ఏం తినాలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఏ దేవుళ్లను పూజించాలో ఏ భాష మాట్లాడాలో నిర్ణయించుకునే హక్కు ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదంటూ ప్రశ్నించారు.

    ఇంగ్లిష్ వద్దంటూ హిందీని బలవంతంగా రుద్దడం వల్ల అంతర్జాతీయ అవకాశాలకు యువత దూరమవుతారని కేటీఆర్ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలు

    యుద్ధ విమానం

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    శుక్రవారం నాలుగు చైనా యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

    ఫైటర్ జెట్ షెన్యాంగ్ జె-11, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ప్లేన్ షాన్సి వై-8లతో పాటు రెండు హెలికాప్టర్లు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌(ఏడీఐజడ్)లో కనిపించినట్లు ఆ వార్తలు తెలిపాయి.

    తైవాన్ మీద అన్ని హక్కులు తమకే ఉన్నాయంటూ చాలా కాలంగా చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే.

  14. మే 21న ఆస్ట్రేలియాలో ఎన్నికలు

    ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్

    ఫొటో సోర్స్, Reuters

    ఆస్ట్రేలియాలో వచ్చే నెల 21న సాధారణ ఎన్నికలు నిర్వహిస్తామని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు.

    లిబరల్ పార్టీ నాయకుడైన స్కాట్ మోరిసన్ 2018 నుంచి ఆస్ట్రేలియా ప్రధానిగా ఉన్నారు.

    పెరుగుతున్న జీవన వ్యయం, పర్యావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు ఈ సారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి.

    లిబరల్స్, నేషనల్స్‌కు ఓటు వేయడం ద్వారా మాత్రమే ఆస్ట్రేలియా ఆర్థికవ్యవస్థను బలంగా ఉంచగలమని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు స్కాట్ మోరిసన్.

  15. తెలంగాణ రాష్ట్ర పుష్పం 'తంగేడు' వనాలు వేగంగా అంతరించి పోతున్నాయా?

    తెలంగాణ ‘బతుకమ్మ’ పండుగలో ఎంతో ప్రాధాన్యం ఉన్న తంగేడు పువ్వులు కనిపించడం ముందు ముందు కష్టంగా మారనుందా? ఒకప్పుడు విస్తారంగా కనిపించిన తంగేడు వనాలు అంతరించి పోతున్నాయా? కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర నిపుణుల పరిశోధనల్లో ఏం తేలింది?

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  16. పాకిస్తాన్: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్

    పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. దీంతో ఆయన పదవీచ్యుతులయ్యారు.

    ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓటింగ్ జరిగింది.

  17. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన

    కీయెవ్ వీధుల్లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీతో సమావేశమయ్యారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.

    యుక్రెయిన్‌కు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు బోరిస్ జాన్సన్ కీయెవ్ వెళ్లారని, బ్రిటన్ ప్రధాని కార్యాలయం తెలిపింది.

    బోరిస్ జాన్సన్ పర్యటన ముందుగా ప్రకటించింది కాదు.

    ఎన్నో కష్టాలను తట్టుకుని నిలబడిన యుక్రెయిన్, కీయెవ్ నుంచి రష్యా బలగాలను తరిమి కొట్టిందని బోరిస్ జాన్సన్ అన్నారు.

    ఈ సందర్భంగా 120 ఆర్మర్డ్ వెహికల్స్, యాంటీ షిప్ మిసైల్స్‌ను యుక్రెయిన్‌కు పంపనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.

    కీయెవ్‌లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

    ఫొటో సోర్స్, Reuters

    బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, Reuters

  18. పాకిస్తాన్: ‘‘ప్రధాని పదవికి బరిలో నిలిచేవారు 11 గంటలులోగా నామినేషన్ పత్రాలు సమర్పించాలి’’

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    నాటకీయ పరిణామాల నడుమ పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ శనివారం అర్ధరాత్రి తన పదవిని కోల్పోయారు.

    ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు స్పీకర్ అసద్ ఖైసర్ నిరాకరిస్తూ రాజీనామా సమర్పించారు.

    ఆ తర్వాత స్పీకర్ స్థానంలో కూర్చుని అయాజ్ సాదిఖ్ ఓటింగ్ నిర్వహించారు.

    342 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 174 ఓట్లు వచ్చాయి. దీంతో ఇమ్రాన్ పదవీచ్యుతుడయ్యారు.

    కొత్త ప్రధాన మంత్రిని ఎన్నుకునేందుకు సభ సోమవారం సమావేశం అవుతుంది.

    అయితే, ప్రధాని పదవికి బరిలో నిలిచేవారు స్థానిక కాలమానం ప్రకారం 11 గంటలు లోగా నామినేషన్‌లు సమర్పించాలని అయాజ్ సాదిఖ్ చెప్పారు.

    ప్రస్తుతం ప్రధాని పదవి రేసులో పీఎంఎల్-ఎన్‌కు చెందిన ప్రతిపక్ష నాయకుడు షాబాజ్ షరీఫ్ ముందున్నారు.

  19. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.