భారత్ వాణిజ్యలోటు రూ. 14.50 లక్షల కోట్లు... 2020-21తో పోల్చితే 87 శాతం పెరుగుదల

2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ. 417.81 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు కూడా రూ. 610.22 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ కారణంగానే రూ. 192.41 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదైంది.

లైవ్ కవరేజీ

రాజేశ్ పెదగాడి

  1. శ్రీలంక: కొలంబోలో కర్ఫ్యూ.. అక్కడ పరిస్థితి ఎలా ఉంది?, బీబీసీ దక్షిణాసియా కరస్పాండెంట్ రజినీ వైద్యనాథన్ విశ్లేషణ

    శ్రీలంక

    ఫొటో సోర్స్, NURPHOTO/GETTY IMAGES

    ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస తన పార్టీ సభ్యులతో నిరసన తెలుపుతూ ఆదివారం కొలంబో ఇండిపెండెన్స్ స్క్వేర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.

    ‘‘ఇక్కడి చట్టాలు ప్రజల హక్కులు పరిరక్షించేందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ప్రజాస్వామ్యంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. ఆ హక్కును ఎవరూ హరించలేరు’’అని ఆయన చెప్పారు.

    కర్ఫూతోపాటు సోషల్ మీడియాపై విధించిన ఆంక్షలు నియంతృత్వ ధోరణిని కళ్లకు కడుతున్నాయని ఆయన అన్నారు.

    కర్ఫ్యూని ధిక్కరించి వీధుల్లోకి వస్తున్న మరికొంత మందితోకూడా నేను మాట్లాడాను.

    రద్దీగా ఉండే కొలంబో రోడ్డులోని ఆసియా రెస్టారెంట్ పరిసరాల్లో నిరసన తెలిపేందుకు వచ్చిన వారిలో సుచిత్ర కూడా ఒకరు.

    ఆయన తనతోపాటు 15 నెలల బాబును కూడా తీసుకొచ్చారు. తను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు.

    ‘‘కరెంటు లేకపోతే ఫ్యాన్లు తిరగవు. ఇలాంటి వేడిలో బాబుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. తను పడుకోవడం కూడా కష్టం అవుతోంది.’’

    ‘‘నా హక్కులను తీసేసుకోవడం వల్లే నేను బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నాను. నాకు చాలా కోపంగా ఉంది’’ అని అంజలీ వనదుర్గాల అనే మహిళ చెప్పారు. ‘‘వారు ఎందుకు ఈ కర్ఫ్యూ విధించారు? మీ కోసమా? అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా?’’అని ఆమె అడిగారు.

    బయటకు వచ్చి ఇలా నిరసన తెలపడం ఇదే తొలిసారని ఫ్రీల్యాన్స్ అడ్వర్టైజింగ్ కాపీరైటర్ సథసరా చెప్పారు. ‘‘ఇప్పుడు నాకు ఎలాంటి ఉద్యోగం లేదు. గ్యాస్, విద్యుత్ కూడా లేవు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది’’అని ఆయన వివరించారు.

  2. రాహుల్ గాంధీని కలవబోతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు

    కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని తెలంగాణకు చెందిన పార్టీ నాయకులు సోమవారం కలవబోతున్నారు.

    ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపైనా వీరు చర్చించనున్నారు.

    వరి కొనుగోలు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. రాహుల్ నివాసంలో ఈ భేటీ జరుగనుంది.

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన సమయంలోనే కాంగ్రెస్ నాయకులు కూడా దిల్లీ వస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర కూటమికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. భారత మ్యుజీషియన్‌ రిక్కీకి గ్రామీ అవార్డు

    స్టెవార్ట్ కోప్‌ల్యాండ్‌తో రిక్కీ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, స్టెవార్ట్ కోప్‌ల్యాండ్‌తో రిక్కీ

    64వ గ్రామీ అవార్డుల ప్రదాన కార్యక్రమం అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఆదివారం నిర్వహించారు.

    భారత్‌కు చెందిన రిక్కీ కేజ్‌కు దీనిలో గ్రామీ అవార్డును ప్రదానం చేశారు. రిక్కీకి గ్రామీ అవార్డు దక్కడం ఇది రెండోసారి.

    రిక్కీ స్వరపరిచిన డివైన్ టైడ్స్ ఆల్బమ్‌కుగాను ఈ అవార్డు దక్కింది.

    ‘‘డివైన్ టైడ్స్ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఈ లివింగ్ లెజెండ్ (స్టెవార్ట్ కోప్‌ల్యాండ్) నాతోపాటు ఉన్నారు. ఆయనకు ఇది ఆరో గ్రామీ అవార్డు. నాకు రెండోది’’అని రిక్కీ ఓ ట్వీట్ చేశారు.

    అమెరికాలో జన్మించిన రిక్కీ బెంగళూరులో ఉంటున్నారు.

    పాకిస్తానీ గాయకురాలు ఉరూజ్ అఫ్తాబ్‌కు కూడా ‘‘బెస్ట్ గ్లోబల్ ఫెర్ఫార్మెన్స్’’కింద గ్రామీ అవార్డు దక్కింది. పాకిస్తాన్ నుంచి ఈ అవార్డు దక్కించుకున్న తొలి మహిళ ఆమె.

    మొహబ్బత్ పాటకుగాను ఉరూజ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. యుక్రెయిన్‌లో వార్ ఫోటోగ్రాఫర్ మృతి.. ఆయన తీసిన చిత్రాలివి

    లివిన్

    ఫొటో సోర్స్, Reuterst

    యుక్రెయిన్‌లో యుద్ధంపై రిపోర్టింగ్ చేస్తున్న మరో జర్నలిస్టు మరణించారు. మార్క్స్‌ లెవిన్.. యుక్రెయిన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్. రాయిటర్స్ వార్తా సంస్థ కోసం ఆయన పనిచేసేవారు.

    యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు ఉత్తరంగా ఏప్రిల్‌ 1న లెవిన్ మృతదేహం కనిపించినట్లు న్యూస్ వెబ్‌సైట్ ఎల్‌బీ.యూఏ పేర్కొంది.

    లెవిన్‌కు భార్యతోపాటు నలుగురు పిల్లలున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

    ‘‘2013 నుంచి రాయిటర్స్ వార్తా సంస్థకు లెవిన్ చాలా మంచి ఫోటోలు అందించారు. ఆయన మృతి తీరని లోటు’’అని రాయిటర్స్ వార్తా సంస్థ విజువల్స్ విభాగం మేనేజింగ్ ఎడిటర్ జాన్ పుల్‌మ్యాన్ చెప్పారు.

    యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి లెవిన్ తీసిన చిత్రాలివీ..

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

  5. శ్రీలంకలో మూకుమ్మడిగా రాజీనామా చేసిన క్యాబినెట్ మంత్రులు

    రాజపక్ష

    ఫొటో సోర్స్, REUTERS

    శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నడుమ క్యాబినెట్ మంత్రులంతా ఆదివారం రాత్రి అధ్యక్షుడు గోటాబయ రాజపక్షకు రాజీనామా సమర్పించారు. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి దినేశ్ గుణవర్దన స్పష్టంచేశారు.

    అయితే, అధ్యక్షుడి సోదరుడు, ప్రధాన మంత్రి మహింద రాజపక్ష మాత్రం రాజీనామా చేయలేదు.

    రాజపక్ష కుటుంబం మొత్తంగా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

    శ్రీలంకలోని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాయి. అయితే, ఆంక్షలను ధిక్కరించి నిరసనకారులు వీధుల్లోకి వస్తున్నారు.

    1948లో స్వాతంత్ర్యం తర్వాత ఇంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక చూడలేదు.

    రాజీనామా చేసిన మంత్రుల్లో ప్రధాన మంత్రి కొడుకు నమల్ రాజపక్ష కూడా ఉన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరతకు తన రాజీనామా తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

  6. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హలో ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.