ఉత్తర్ ప్రదేశ్
ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని
నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ
కార్యక్రమానికి హాజరు కానున్నారు.
యోగి ఆదిత్యనాథ్
2017లో తొలిసారి యూపీ ముఖ్యమంత్రి అయ్యారు.
అలాగే బీజేపీ
పాలనలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర బీజేపీ సీనియర్ నేతలు కూడా హాజరుకానున్నారు.
ఇక కాంగ్రెస్
పార్టీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్
యాదవ్, బీఎస్పీ అధినేత మాయావతి వంటి వారికి కూడా ఆహ్వానాలు పంపారు.
బాబాలు,
ఆధ్యాత్మిక గురువులు, పారిశ్రామికవేత్తలు కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి
రానున్నారు.
యోగి ఆదిత్యనాథ్
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న సందర్భంగా గోరఖ్పూర్ మఠంలో ప్రత్యేక
పూజలు చేశారు.