ఇవాళ్టి ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్లో చీప్ లిక్కర్ అనేదే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రేటు పరంగా తక్కువ ధరకు అమ్మే మద్యం ఉంది కానీ చీప్ లిక్కర్ లేదని అసెంబ్లీ వేదికగా తెలిపారు. తెలంగాణలో ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ చార్జీలు పెరగనున్నాయి.
తెలంగాణ గిరిజన రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం తప్పుదారి పట్టిస్తోందంటూ హైదరాబాద్లో బీజేపీ కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు.
సికింద్రాబాద్లోని బోయగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు.
అత్యవసరం అనుకుంటే అణ్వాయుధాలు వాడుతామని రష్యా పేర్కొంది. అణ్వాయుధాలపై రష్యా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని అమెరికా పేర్కొంది.
తూర్పు యూరప్లో తమ బలగాలను భారీగా పెంచడానికి నాటో ఆమోదం తెలుపుతుందని నాటో సెక్రటరీ జనరల్ చెప్పారు.
నాటో సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ యూరప్కు బయలుదేరారు.
రష్యా బలగాలు చుట్టుముట్టిన మరియుపూల్లో తిండి నీరు లేక సుమారు లక్ష మంది ప్రజలు బాధపడుతున్నారని యుక్రెయిన్ తెలిపింది.
రష్యా, యుక్రెయిన్ తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.