కరోనావైరస్: భారత్‌లో 23వేలు దాటిన కేసుల సంఖ్య, ఏపీలో 955, తెలంగాణలో 983 మందికి పాజిటివ్

ప్రపంచవ్యాప్తంగా 27 లక్షలకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. 1.93 లక్షల మంది మరణించారు. అమెరికాలో కోవిడ్ బాధితుల సంఖ్య 8.7 లక్షలు దాటింది. 50 వేల మంది మరణించారు. భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 23,000 దాటింది.

లైవ్ కవరేజీ

  1. కిడ్డీ బ్యాంక్ మనీతో యూకేకు 20వేల మాస్క్ లు పంపిన చిన్నారులు

    వియత్నాంకు చెందిన ఇద్దరు చిన్నారులు 20 వేల మెడికల్ మాస్క్ లను యునైటెడ్ కింగ్ డమ్ కు గిఫ్ట్ గా ఇచ్చారు.

    నాన్, ఖోయి అనే ఈ ఇద్దరు చిన్నారులు కొద్ది సంవత్సరాలుగా తాము దాచుకున్న డబ్బుతో ఈ మాస్కులు కొన్నారు.

    వియత్నాంలో ఉన్న బ్రిటీష్ రాయబారి గరెత్ వార్డ్ ...ఈ చిన్నారులకు కృతజ్జతలు చెబుతూ లేఖ రాశారు.

    లాక్‌డౌన్ కారణంగా వియత్నాంలో చిక్కుకుపోయిన వందమందిని గతవారం ఇంగ్లాండ్ పంపారు. ఆ విమానంలోనే ఈ మాస్క్ లను చేరవేశామని రాయబారి గరెత్ వార్డ్ తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  2. ఆంధ్రప్రదేశ్‌లో మరణాలు 29.. మొత్తం కేసులు 955

    ఏపీలో కొత్తగా 62 పాజిటివ్ కేసులు న‌మోద‌ు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 955కి చేరింది.

    ఇప్ప‌టివ‌ర‌కు 145 మంది డిశ్చార్జ్ కాగా మృతుల సంఖ్య 29కి పెరిగింది.

    ప్రస్తుతం 781 మంది చికిత్స పొందుతున్నారు.

    క‌ర్నూలు జిల్లాలో 27 మంది పాజ‌టివ్ గా న‌మోదు కావ‌డంతో ఆ ఒక్క జిల్లాలోనే మొత్తం కేసులు 261కి చేరాయి.

    గుంటూరు జిల్లాలో 206, కృష్ణా జిల్లాలో 102 కేసులు న‌మోద‌య్యాయి.

    కరోనా

    ఫొటో సోర్స్, ap govt

  3. దక్షిణ కొరియాలో గత 24 గంటల్లో మరణాలు నమోదు కాలేదు

    దక్షిణ కొరియా

    ఫొటో సోర్స్, Reuters

    గత 24 గంటలలో దక్షిణ కొరియాలో కోవిడ్-19 మరణాలు నమోదు కాలేదు. ఈ నెలలో ఇలా జరగడం మొదటిసారి.

    కొత్తగా 6 కోవిడ్ కేసులు నమోదు అయినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ఫిబ్రవరి 18 వ తేదీ నుంచి రోజు వారి నమోదు అయిన కేసులలో ఇది అతి తక్కువ.

    కరోనావైరస్ కి గురైన రోగులని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించడం, నిర్బంధంలో పెట్టడం, చికిత్స అందివ్వడం ఈ దేశంలో తీవ్ర స్థాయిలోచేశారు.

    దక్షిణ కొరియాలో ఇప్పటి వరకు 240 మంది మరణించారు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఇది తక్కువే. ఇదంతా లాక్ డౌన్ లేకుండా, ప్రజల కదలికల పై నిర్బంధం విధించకుండా అమలు చేశారు.

    కానీ, ఇప్పుడు జాగ్రత్త వహించాల్సిన సమయమని వైద్య అధికారులు చెబుతున్నారు.

    వ్యాక్సీన్ కనిపెట్టేవరకు ఇది ప్రబలుతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

    అకస్మాత్తుగా తలెత్తబోయే మహమ్మారికి ప్రజలు సంసిద్ధంగా ఉండాలని, అధికారులు రానున్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నారని కె సి డి సి డిప్యూటీ డైరెక్టర్ క్వాన్ చెప్పారు.

  4. 'కరోనా మనకు పాఠాలు నేర్పింది' - ప్రధాని మోదీ

    మన కాళ్ల మీద మనం నిలబడటం అనే పాఠాన్ని కరోనా మహమ్మారి నేర్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

    కరోనా వైరస్ కట్టడి గురించి ఆయన దేశవ్యాప్తంగా అనేకమంది గ్రామ సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

    సంక్షోభ సమయంలో పేదలకు నిత్యావసరాలు అందేలా చూడాలని ప్రధాన మంత్రి మోదీ సర్పంచులకు సూచించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. భారత్‌లో 'హోం మేడ్ మాస్క్' విప్లవానికి సూత్రధారి

    శైలజ
    ఫొటో క్యాప్షన్, శైలజ వి. గుప్తా

    ఇండియాలో ఇంట్లో తయారు చేసుకునే మాస్క్‌లను వాడుతున్న లక్షలాది మంది ప్రజల్లో ఆమె గురించి తెలిసినవారు చాలా తక్కువమందే ఉంటారు.

    58 ఏళ్ల శైలజా వి. గుప్తా భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్ర విజ్ఞాన సలహాదారు కార్యాలయంలో సైంటిస్ట్.

    సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవడంపై ఆమె ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతోపాటు, విధానాల రూపకల్పనలో సహాయపడుతుంటారు.

    ‘‘సమూహంగా తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నచోట వ్యాధి సంక్రమణను అరికట్టడానికి ఇంట్లో తయారు చేసే ఈ మాస్క్ లు ఎంతగానో ఉపయోగపడతాయి’’ అంటున్నారామె.

    ఒకపక్క వ్యాధి నిరోధంలో మాస్కుల పాత్రపై చర్చ జరుగుతుండగా..మరోవైపు అందరూ మాస్కులు వాడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే, ఆసియా ఖండంలోని చాలాదేశాలు మాస్కులను తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందించాయి.

    భారతదేశంలో వ్యక్తిగత రక్షణ సాధనాల (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ ) కొరత ఉంది. సర్జికల్ మాస్కులను పదే పదే కొనాల్సి రావడం చాలామంది భారంగా మారుతోంది.

    ఈ పరిస్థితుల్లో ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులు వ్యాధి నుంచి మనల్పి కాపాడతాయని శ్రీమతి గుప్తా చెబుతున్నారు.

  6. పేదల కోసం ప్రభుత్వం చేయాల్సినంత చేయలేదు: నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ

    అభిజిత్ బెనర్జీ

    ఫొటో సోర్స్, Getty Images

    లాక్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొనే లక్షలాది మంది సామాన్య పేద ప్రజలకు సాయం చేయడంలో భారత్ మరింత ఉదారంగా వ్యవహరించి ఉండాల్సిందని నోబెల్ ప్రైజ్ విజేత, ఆర్ధికవేత్త అభిజిత్ బెనర్జీ బీబీసీతో అన్నారు. ‘‘ మనం ఇంకా చేయాల్సినంత చేయలేదు’’ అని బీబీసీ ఇంటర్వ్యూ లో అభిప్రాయపడ్డారు అభిజిత్.

    మార్చి 24 లాక్ డౌన్ విధించిన తర్వాత భారత ప్రభుత్వం 23 బిలియన్ డాలర్లు ప్యాకేజిని ప్రకటించింది.ఇందులో ఎక్కువభాగం పేద ప్రజలకు డబ్బు, ఆహార భద్రతకే కేటాయించారు.ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్ లతో కలిసి నోబెల్ బహుమతిని సంయుక్తంగా స్వీకరించిన ప్రొఫెసర్ బెనర్జీ, కొవిడ్ -19 మహమ్మారి కారణంగా వ్యవస్థ కుదుపుకు గురైందన్న ప్రభుత్వ అభిప్రాయం నిజమేనన్నారు. ’’లాక్ డౌన్ తో కథ ముగిసిపోలేదు. సమీప భవిష్యత్తులో దీనికి వ్యాక్సీన్ రావచ్చు. కానీ, అది వచ్చే వరకు కోవిడ్ మనతోనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు అభిజిత్ బెనర్జీ.

  7. శాస్త్రీయతలేని లైట్, హీట్ చికిత్సలపై దృష్టి సారించాలంటున్న ట్రంప్

    ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనా చికిత్సకు వేడి, కాంతివంటి వాటితో జరిపే ట్రీట్ మెంట్లపై దృష్టిసారించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచించారు.

    ప్రతిరోజూ నిర్వహించే మీడియా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. శరీరంలోకి తీవ్రమైన కాంతి, వైరస్ ను చంపే ఔషధాలను పంపే విధానాలను అవలంబించాలని ఆయన అన్నారు.

    కానీ, కొవిడ్ -19 చికిత్సలో ఇవన్నీ శాస్త్రీయమైనవిగా ఇప్పటి వరకు నిరూపితం కాలేదు.

    అదే మీడియా సమావేశంలో పాల్గొన్న వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ డెబోరా బిక్స్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. వేడి వల్ల కరోనా వైరస్ చచ్చిపోతుందనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

  8. ఇండోనేషియాలో ఫత్వాలకు భయపడి ప్రార్ధనలు, రెస్టీ వోరో యూనియర్, బీబీసీ జకార్తా

    ఇండొనేసియా

    ఫొటో సోర్స్, Hidayatullah

    రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఇండోనేషియాలోని ఆసే నగరంలో ఉన్న అతి పెద్ద మసీదుకు ప్రజలు భారీ ఎత్తున చేరుకున్నారు.

    గురువారం రాత్రి జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రార్ధలనకు కోసం మసీదుకు వచ్చిన వారిలో చాలామంది మాస్కులు ధరించారు.

    కానీ, దగ్గర దగ్గరగా ఉండే ప్రార్ధనలు చేశారు. భౌతిక దూరంపై ఇండోనేషియా ప్రభుత్వం ఇచ్చిన సూచనలను వారు ఏమాత్రం పట్టించుకోలేదు.‘‘కరోనా వైరస్ తో చచ్చిపోతానేమోనన్న భయం నాకు ఉంది. కానీ ఆ భయం నన్ను ప్రార్ధన చేయకుండా ఆపలేదు. చేతులు కడుక్కుంటూ, మాస్కులు ధరిస్తూ వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండటం ఇక్కడ ముఖ్యం’’ అని పుత్రి సారా బీబీసీతో అన్నారు .

    అయితే, ఇంకో భక్తుడు వాహ్యుక మాత్రం తాను బలవంతంగా ప్రార్ధనలకు వచ్చినట్లు వెల్లడించాడు. తన పిల్లలు ప్రార్ధనలకకు వెళ్లాల్సిందిగా తనను బలవంతపెట్టారని అన్నాడు. ‘‘ఇలా సామూహికంగా ప్రార్ధన చేయాలంటే భయపడ్డాను. అందుకే, మిగతా వారికి కాస్త దూరంగా ఉండి ప్రార్ధన చేశాను’’ అని చెప్పారు వాహ్యుక.

    ‘‘ప్రభుత్వ హెచ్చరికలకన్నా ఫత్వాలకు, మత పెద్దల సూచనలకే ప్రజలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ’’ అని ఆసే నగరంలోని సియా కౌలా యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్ మారిని క్రిస్టియాని వ్యాఖ్యానించారు.

    ఇండోనేషియాలో ఇస్లామిక్ షరియా చట్టం అమలులో ఉన్న ఒకే ఒక్క నగరం ఆసే. ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఈ నగరంలో తరచూ కొరడా దెబ్బల శిక్షలు అమలవుతుంటాయి. గత మంగళవారం ఆరుగురికి ఈ శిక్ష అమలు చేయగా...అందులో ఒకే ఒక్క వ్యక్తి మాస్క్ ధరించాడు.

  9. యూకేలో తొలి వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

    యూరప్ లోనే తొలిసారిగా కరోనా వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ తో క్లినికల్ ట్రయల్స్ యునైటెడ్ కింగ్ డమ్ లో మొదలయ్యాయి. ముందుగా ఇద్దరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ను ఇంజెక్ట్ చేశారు.

    ఈ వ్యాక్సిన్ ను పరిశీలించడం కోసం 800మందికిపైగా వాలంటీర్లను ఎంచుకున్నారు. ఇందులో సగం మందికి కొవిడ్ -19 వ్యాక్సిన్ వేస్తారు. మిగిలిన సగంమందికి మెనింజైటిస్ ను నిరోధించే వ్యాక్సిన్ వేస్తారు.

    అయితే తమకు ఏ వ్యాక్సిన్ వేశారో వాలంటీర్లకు తెలియదు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక బృందం మూడు నెలలుగా పరిశోధించి ఈ వ్యాక్సిన్ ను సిద్ధం చేసింది.

    జెన్నర్ ఇనిస్టిట్యూట్ లో వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న సారా గిల్బర్ట్ ఈ ప్రి-క్లినికల్ రీసెర్చ్ కు నాయకత్వం వహించారు. ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని తమకు 80శాతం నమ్మకం ఉందని గతంలో ఆమె ప్రకటించారు.

    ఈసారి సంఖ్య చెప్పకుండా...ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని తాము ఆశాభావంతో ఉన్నట్లు ఆమె ప్రకటించారు.

  10. వెహికల్ పాసుల కోసం మదురై కలెక్టరేట్ ముందు కోలాహలం

    లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం వాహనాలకు ప్రభుత్వం ప్రత్యేక పాసులిస్తుండటంతో తమిళనాడులోని మదురై జిల్లాలో చాలామంది వాహనదారులు దరఖాస్తు చేసుకున్నారు.

    కలెక్టరేట్ లో ఈ పాసులు జారీ చేస్తారని తెలియడంతో పెద్ద ఎత్తున జనం అక్కడ పోగయ్యారు. అయితే కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధించడానికి భౌతికదూరం పాటించాలన్న నిబంధనలను అందరూ మార్చిపోయారు.

    భారీ ఎత్తున జనం తరలి రావడంతో వారిని అదుపు చేయడానికి అధికారులు చివరకు కలెక్టరేట్ గేట్లను మూసేయాల్సి వచ్చిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. రూ. 36 లక్షల కోట్ల కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు అమెరికా ఆమోదం

    యూఎస్ కాంగ్రెస్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, అమెరికన్ కాంగ్రెస్‌లో మాస్కులు ధరించిన డెమాక్రటిక్ నేత నాన్సీ పెలోసీ తదితరులు

    అమెరికన్ కాంగ్రెస్ 484 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 36 లక్షల కోట్లు) ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.

    ఈ తీర్మానానికి ప్రతినిధుల సభలో 388-5 ఓట్లతో ఆమోదం లభించింది. ఈ ప్యాకేజీలో అధిక భాగాన్ని చిన్న వ్యాపారాలను ఆదుకోవడానికి ఖర్చు చేస్తారు. అలాగే, ఆస్పత్రులు, వైరస్ పరీక్షల కోసం కూడా ఈ నిధులు ఉపయోగపడతాయి.

    సెనేట్‌లో కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందిన ఈ బిల్లును చట్టం చేయబోతున్నట్లు అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తెలిపారు.

    అమెరికాలో కోవిడ్ బాధితలు సంఖ్య ఎనిమిదన్నర లక్షలు దాటిపోయింది. మృతుల సంఖ్య 50 వేలకు దగ్గరగా ఉంది.

    గత నెలలోనే అమెరికా దేశ ఆర్థిక స్థితి ఉద్దీపన కోసం 152 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని అమల్లోకి తెచ్చింది. గురువారం నాటి బిల్లుతో కలిపి అమెరికాలో కోవిడ్ ప్రత్యేక నిధుల మొత్తం దాదాపు 220 లక్షల కోట్లకు చేరింది. దీంతో, అమెరికా బడ్జెట్ లోటు రికార్డు స్థాయికి చేరుకుంది.

  12. కరోనావైరస్ LIVE అప్‌డేట్స్ పేజీకి తిరిగి స్వాగతం

    ఇవీ ముఖ్యాంశాలు:

    - అమెరికాలో 50 వేలకు చేరువలో కోవిడ్ మృతులు. రూ. 36 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం.

    - ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితుల సంఖ్య 27 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 2 లక్షలకు చేరుకుంటోంది.

    - భారతదేశంలో వైరస్ సోకిన వారి సంఖ్య 21,700 దాటింది. 686 మంది కోవిడ్ వ్యాధితో చనిపోయారు. అయితే, 4,325 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

    - తెలంగాణలో 693 యాక్టివ్ కేసులు. ఏపీలో 893కు చేరిన కోవిడ్ కేసుల సంఖ్య.