యూరప్ ఐక్యతకు పిలుపునిచ్చిన మెర్కెల్
కరోనావైరస్ను నియంత్రించడం యూరప్ ఐక్యతకు పెను సవాలని జర్మనీ ఛాన్స్ లర్ ఎంగెలా మెర్కెల్ అన్నారు.
‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజల జీవనం, ఆరోగ్యానికి ఇదే అతిపెద్ద సవాలు’’ అని దేశ పార్లమెంటు దిగువ సభలో ఆమె అన్నారు.
గురువారం సాయంత్రం ఆమె ఈయూ నాయకుల వీడియో కాన్ఫరెన్స్లో పాల్గోనున్నారు.
‘‘వీలైనంత క్రమశిక్షణతో మనం భద్రమైన జీవితంలోకి త్వరగా రాగలం’’ అని మెర్కెల్ చెప్పారు.
లాక్డౌన్లను ఎత్తేయడం, తిరిగి విధించడం వంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి క్రమశిక్షణ అవసరమని తెలిపారు.
ఇప్పటి వరకూ సాధించినదానిని వృధా చేయకూడదని వెల్లడించారు. జర్మనీ ఆరోగ్య వ్యవస్థను, సైనిక దళాల మద్దతును ఆమె కొనియాడారు.
లెక్కలేనంతమంది ప్రజల జీవితాలను కాపాడే ఆరోగ్య వ్యవస్థపై అధిక భారం పడకుండా చూడటం ఎలా అన్నదే జర్మనీ, యూరప్ రాజకీయాలు చాలాకాలం పాటు ఎదుర్కొనే ప్రశ్న అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రపంచ సరఫరాలపై ఆధారపడకుండా ప్రత్యేక మెడికల్ కిట్లను తయారు చేసుకునే సామర్థ్యాన్ని యూరప్ పెంచుకోవాలని ఆమె తెలిపారు.