కోవిడ్-19 మరణాలను 50 శాతం పెంచిన వుహాన్
కోవిడ్-19 కారణంగా మరణించిన వారి సంఖ్యను అధికారికంగా 50 శాతం (1,290 మంది) పెంచింది చైనాలోని వుహాన్ నగరం. గతేడాది ఈ నగరంలోనే కరోనావైరస్ పుట్టి, ప్రపంచం మొత్తం వ్యాపించింది.
తాజా లెక్కలతో నగరంలో కోవిడ్-19 మృతుల సంఖ్య 3,869కి చేరింది. చైనాలో మృతుల సంఖ్య 4,600లకు పెరిగింది.
కొత్తగా నమోదైన మరణాలన్నీ ఆస్పత్రులకు వెలుపల సంభవించినవేనని అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందులో దాచిపెడుతున్నది ఏమీ లేదని చైనా ప్రభుత్వం అంటోంది.
కరోనావైరస్ విషయంలో చైనా సరైన సమాచారాన్ని పంచుకోవడం లేదని, వాస్తవాలను తొక్కిపెడుతోందనే విమర్శలు ఉన్నాయి.
వుహాన్ జనాభా 1.1 కోట్లు. కొన్ని నెలల పాటు ఈ నగరాన్ని నిర్బంధించారు. ఈ మధ్యనే లాక్ డౌన్ సడలించారు.