తెలంగాణలో
కొత్తగా ఈరోజు 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో
మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 516కు చేరింది.
రాష్ట్రంలో
ఈరోజు ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 18కి చేరింది.
ఈరోజు
రాష్ట్రంలో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకూ ఆస్పత్రుల నుంచి
డిశ్చార్జ్ అయినవారి సంఖఅయ 110కి చేరింది.
గ్రేటర్
హైదరాబాద్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసులతో కలిసి ఈ సంఖ్య 249కి
చేరింది.
ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 644కు చేరింది.
ఒకే కుటుంబంలో 17 కరోనా పాజిటివ్ కేసులు
హైదరాబాద్
లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు
ధ్రువీకరించారు. వీరిలో 10 నెలల శిశువు కూడా ఉన్నట్టు చెబుతున్నారు.
ఈ కుటుంబానికే
చెందిన ఒక 60 ఏళ్ల మహిళ ఏప్రిల్ 10న మృతిచెందడంతో ఇవి వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్
తలాబ్ కట్ట ప్రాంతంలో నివసించే ఈ కుటుంబానికి చెందిన మొత్తం 41 మందికి కోవిడ్-19
పరీక్షలు నిర్వహించగా వీరిలో 17 మందికి పాజిటివ్ వచ్చింది.
పాజిటివ్ వచ్చిన అందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు, ఇదే కుటుంబంలోని
మిగతా 24 మందిని క్వారంటైన్కు తరలించారు.
కుటుంబంలోని
మహిళకు అసలు వైరస్ ఎలా సోకింది అనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణలో ఒకే కుటుంబానికి చెందినవారిలో ఇంత మందికి కరోనా పాజిటివ్ రావడం ఇదే
మొదటిసారి.
ఈ
కుటుంబంలో 10 నెలల శిశువు నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు ఆరుగురు ఉన్నట్లు సమాచారం.
భారత్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,815కు చేరింది.
దేశంలో ఇప్పటివరకూ కరోనా వల్ల 353 మంది చనిపోయారు.