కరోనావైరస్ కారణంగా పదమూడేళ్ల బాలుడి మృతి
కరోనావైరస్ పాజిటివ్ వచ్చిన పదమూడేళ్ల బాలుడు లండన్లో మరణించాడు.
బ్రిక్స్టన్ కు చెందిన ఇస్మాయిల్ మొహమ్మద్ అబ్దుల్ వాహబ్ కింగ్స్ కాలేజ్ హాస్పటల్లో సోమవారం మరణించాడు. యూకేలో కరోనావైరస్ కారణంగా మరణించిన వారిలో అతి చిన్న వయస్కుడు ఇతడే అని భావిస్తున్నారు.
అతడు కరోనావైరస్ కారణంగానే చనిపోయాడని హాస్పటల్ ట్రస్ట్ తెలిపింది.
అతడికి ఎలాంటి వ్యాధి లక్షణాలూ లేవని, కానీ కరోనా పాజిటివ్ అని వచ్చిందని ఇస్మాయిల్ కుటుంబం వెల్లడించింది. శుక్రవారం వ్యాధి నిర్థరణ కాగానే, తర్వాత రోజు హాస్పటల్లో చేర్చామని వారు తెలిపారు.
"ఈ వయసువారిలో కరోనావైరస్ సోకినా కేవలం 0.3% మందికి మాత్రమే ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. వారిలో కూడా మరణాల శాతం కేవలం 0.006% మందికి మాత్రమే చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ప్రతి 30000 మంది కరోనా రోగుల్లో కేవలం ఇద్దరు మాత్రమే మరణించే ఆస్కారం ఉంది" అని బీబీసీ హెల్త్ ప్రతినిధి నిక్ ట్రిగిల్ తెలిపారు.