You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పాకిస్తాన్: తాలిబాన్ల చెర నుంచి పోలీసులకు విముక్తి... 33 మంది మిలిటెంట్లు మరణం

బన్ను కంటోన్మెంట్‌లోని ఒక కౌంటర్ టెర్రరిజం కేంద్రాన్ని తాలిబాన్లు తమ అధీనంలోకి తీసుకుని అక్కడి సిబ్బందిని బంధీలుగా పట్టుకుంది.

లైవ్ కవరేజీ

  1. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్‌లో విజయసాయి రెడ్డి, పీటీ ఉషలకు చోటు

    ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్‌లో చోటుదక్కింది.

    ఈ మేరకు సోమవారం రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో విజయసాయి రెడ్డి పేరును రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేర్చారు.

    ఆయనతో పాటు పీటీ ఉషను కూడా ఈ ప్యానల్‌లో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

    ఈ పార్లమెంట్ సమావేశాలకు ముందు విజయసాయి రెడ్డి పేరుని రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో ఉన్నట్లు చెప్పినా.. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ధన్కర్ సభలో ప్రకటించిన జాబితాలో ఆయన పేరు లేదు.

    తాజాగా జాబితాలో ఆయన పేరును చేర్చడంతో విజయసాయి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

  2. మావోయిస్టు రిక్రూట్‌మెంట్ కేసులో అయిదుగురిపై ఎన్‌ఐఏ చార్జిషీటు

    కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)లోకి యువత రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కేసులో అయిదుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చార్జి షీట్ నమోదు చేసిందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఒక ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ ఈ చార్జిషీటును ఫైల్ చేసింది.

    నిషేధిత సంస్థ అయిన సీపీఐ (మావోయిస్టు)లోకి రాధ అనే మహిళను రిక్రూట్ చేసుకున్నారంటూ నమోదైన ఫిర్యాదు ఆధారంగా దొంగరి, దేవేంద్ర, దుబాసి స్వప్న, చుక్కా శిల్పతో సహా మరొకరిపై ఈ చార్జిషీటును దాఖలు చేసినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

  3. నిరుద్యోగులు రూ. ల‌క్ష నుంచి 50 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొందడం ఇలా

  4. క్యాపిటల్ హిల్ హింస కేసు: ‘‘4 అభియోగాలపై ట్రంప్‌ను విచారించాలి’’- దర్యాప్తు కమిటీ

    అమెరికాలో గతేడాది జరిగిన రాజధాని అల్లర్ల కేసులో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తిరుగుబాటు సహా 4 అభియోగాలపై విచారించాలని దర్యాప్తు కమిటీ సిఫారసు చేసింది.

    డెమోక్రటిక్ పార్టీ నేతృత్వంలోని ఈ కమిటీ ట్రంప్‌ను విచారించాలనే న్యాయశాఖ వాదనతో ఏకీభవించింది.

    ట్రంప్ మాజీ సహాయకుడు హోప్ హిక్స్‌కు చెందిన ఒక క్లిప్‌ను కూడా బయటపెట్టింది. ఇందులో ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకునేందుకు హోప్ హిక్స్ తిరస్కరిస్తూ కనిపిస్తున్నారు.

    2021 జనవరి 6న అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి జరిగింది.

    వాషింగ్టన్ నగరంలో జరిగిన ఈ హింసలో ఒక పోలీసు సహా అయిదుగురు మరణించారు.

    తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ ఒక ప్రకటన విడుదల చేసిన ట్రంప్ అందులో దర్యాప్తు కమిటీని ‘కంగారూ కోర్ట్’ అని వ్యాఖ్యానించారు.

    దాదాపు 18 నెలలుగా క్యాపిటల్ హిల్ అల్లర్లపై దర్యాప్తు జరుగుతోంది. సోమవారం జరిగిన చివరి సమావేశంలో ట్రంప్ నాలుగు ఆరోపణల కింద విచారణలు ఎదుర్కోవాలని కమిటీ సిఫార్సు చేసింది.

  5. వైసీపీ ఎమ్మెల్యే ఎలీజాకు కారు ప్రమాదం, కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న కారు, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.

    ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఆ వాహనంలో ఉన్నారు.

    సకాలంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఎటువంటి ముప్పు లేకుండా బయటపడ్డామని ఎమ్మెల్యే ఎలీజా తెలిపారు.

    విజయవాడ నుంచి చింతలపూడి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

    మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో ఘటన జరిగింది.

    ఆడమిల్లి సమీపంలో కారు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో కరెంటు స్తంభం విరిగిపోయింది.

    ట్రాన్స్ ఫార్మర్ వద్ద కూడా మంటలు వచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అయినప్పటికీ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డామని ఎమ్మెల్యే మీడియాకు తెలిపారు.

    ప్రమాదం నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారులతో కలిసి మరో కారులో జంగారెడ్డి గూడెం చేరుకున్నారు. గత నెలలో కూడా ఇలాంటి ప్రమాదం నుంచే ఎమ్మెల్యే బయటపడ్డారు.